క‌న్నుల పండువ‌గా పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

Published : Jun 20, 2023, 04:41 PM IST
క‌న్నుల పండువ‌గా పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

సారాంశం

Puri Rath Yatra: భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందోహం భ‌గ‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ‌ల‌ మ‌ధ్య పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభ‌మైంది. ఒడిశాలోని పూరీ సముద్ర తీరాన ఉన్న పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్య‌లో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా కార్య‌క్ర‌మాల‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది. పూరీలో 180 ప్లాటూన్లు (1 ప్లాటూన్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు) భద్రతా బలగాలను మోహరించినట్లు రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ తెలిపారు. సజావుగా ట్రాఫిక్ నిర్వహణ కోసం పట్టణాన్ని వివిధ మండలాలు-విభాగాలుగా విభజించారు.  

Jagannath Rath Yatra in Puri: భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందోహం భ‌గ‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ‌ల‌ మ‌ధ్య పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభ‌మైంది. ఒడిశాలోని పూరీ సముద్ర తీరాన ఉన్న పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్య‌లో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా కార్య‌క్ర‌మాల‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది. పూరీలో 180 ప్లాటూన్లు (1 ప్లాటూన్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు) భద్రతా బలగాలను మోహరించినట్లు రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ తెలిపారు. సజావుగా ట్రాఫిక్ నిర్వహణ కోసం పట్టణాన్ని వివిధ మండలాలు-విభాగాలుగా విభజించారు.

వివ‌రాల్లోకెళ్తే.. మండుతున్న ఎండ‌లతో అధిక వేడిని, తేమను సైతం లెక్కచేయకుండా మంగళవారం పూరీలో జరిగిన పూరీ జ‌గ‌న్నాథుడి వార్షిక రథయాత్రలో దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి వార్షిక విహార యాత్ర కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బడా దండా లేదా పుణ్యక్షేత్రంలోని గ్రాండ్ రోడ్డులో గుమిగూడారు. సంప్రదాయ పహండిలో సేవకులు అంద‌రూ దేవుళ్ల‌ను బయటకు తీసుకువచ్చిన తరువాత, పూరీ గజపతి మహారాజ్ దిబ్యసింగ దేబ్ మూడు రథాలపై 'ఛేరా పంచారా' నిర్వహించారు. ఇక్క‌డి మూడు  ర‌థ యాత్ర‌లు- దర్పాదలన్ (సుభద్రా దేవి రథం), తలద్వాజ (బలభద్రుడి రథం), నందిఘోష (జగన్నాథుని రథం).

జై జగన్నాథ నినాదాల మధ్య, తాళాలు, గాంగ్ ల మధ్య పహండిలో దేవతామూర్తులు తమ తమ రథాల వ‌ర‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆనందంతో నృత్యం చేశారు. ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యక్షేత్రమైన పూరీకి తరలిరావడం నిజంగా ఒక ప్రత్యేకమైన దృశ్యం. విశ్వ ప్రభువు జ‌గ‌న్నాథుడు, ఆయన భక్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని మాటల్లో వర్ణించలేము, ఎందుకంటే ఇది రాబోయే సంవత్సరాల పాటు ఆ క్షణాన్ని ఆస్వాదించడానికి-పునరుద్ధరించడానికి మాత్రమే. ముఖ్యంగా పూరీ శ్రీమందిర్ లోపల మహాప్రభుని దర్శనం చేసుకోలేని వారికి ఆయా రథాలపై స్వామి, ఆయన తోబుట్టువుల దర్శనం ప్రత్యేకమైనది. ఈ ర‌థ‌యాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బడా దందాపై మూడు భారీ రథాలను లాగడంతో భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu