ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం: పాలస్తీనాకు మద్దతుగా కాంగ్రెస్ తీర్మానం

Published : Oct 09, 2023, 06:46 PM ISTUpdated : Oct 09, 2023, 07:16 PM IST
ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం: పాలస్తీనాకు  మద్దతుగా కాంగ్రెస్  తీర్మానం

సారాంశం

ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో  కాంగ్రెస్ పార్టీ  పాలస్తీనాకు మద్దతుగా తీర్మానం చేసింది.  


న్యూఢిల్లీ:  ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో  కాంగ్రెస్ పార్టీ పాలస్తీనాకు  మద్దతును ప్రకటించింది.ఈ మేరకు  ఆ పార్టీ తీర్మానం చేసింది.  ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై  సీడబ్ల్యూసీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. పాలస్తీనా ప్రజల హక్కుల కోసం తమ మద్దతును తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది.హమాస్, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలో శనివారం నాడు 1200 మంది మృతి చెందారు.

 

ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య వివాదం పరిష్కారం కోసం చర్చలు కొనసాగించాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ నొక్కి చెప్పింది.సుదీర్థకాలం పాటు  పోరాటం చేస్తున్న పాలస్తీనా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించింది. ఇరు వర్గాలు తక్షణమే కాల్పుల విరమణకు దిగాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.  సమస్యల పరిష్కారానికి చర్చలు అత్యుత్తమైన మార్గాలని కాంగ్రెస్ కోరింది.ఈ విషయమై బీజేపీ నేత అనిల్ ఆంటోని  స్పందించారు. కాంగ్రెస్ తీర్మానంపై ఆయన మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం