అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు పొడగింపు..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 26, 2020, 05:01 PM IST
అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు పొడగింపు..

సారాంశం

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశీయ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) గురువారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డిజిసిఎ చేత ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవు అని అధికారిక సర్క్యులర్ తెలిపింది.

ఈ యేడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్ లో పాక్షిక మార్పులు చేశామని,  ఈ సర్క్యూలర్ గడువును 2020 డిసెంబర్ 31, అర్థరాత్రి 23 గంటల 59ని.ల వరకు పొడిగించామని తెలిపింది. భారతదేశానికి / భారతదేశానికి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలకు సంబంధించి పైన పేర్కొన్న అంశంపై జారీ చేసిన సర్క్యులర్ ప్రామాణికతను మరింత పెంచిందని డిజిసిఎ సర్క్యులర్‌లో తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground
స్టాలిన్ పై సీఎం విజయ్ పంచ్ లు సభమొత్తం నవ్వులే నవ్వులు | CM Vijay Funny Speech on MK Stalin Viral