సముద్రంలో కూలిపోయిన మిగ్-29 యుద్ధ విమానం.. పైలట్ కు తృటి త‌ప్పిన పెను ప్ర‌మాదం.. 

Published : Oct 12, 2022, 12:12 PM ISTUpdated : Oct 12, 2022, 12:18 PM IST
సముద్రంలో కూలిపోయిన మిగ్-29 యుద్ధ విమానం.. పైలట్ కు తృటి త‌ప్పిన  పెను ప్ర‌మాదం.. 

సారాంశం

నేవీకి చెందిన మిగ్-29 'కె' ఫైటర్ జెట్ గోవా సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్ర‌మాదాన్ని ముందుగానే గ‌మించిన పైలట్ సుర‌క్షితంగా విమానంలో నుంచి ఎజెక్ట్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై  భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది.

మిగ్-29 ఫైటర్ జెట్ క్రాష్: నేవీకి చెందిన మిగ్-29 'కె' ఫైటర్ జెట్ గోవా సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. క్రాష్‌కు ముందు.. పైలట్  విమాన పరిస్థితిని చూసి.. విమానం నుండి ఎజెక్ట్ అయ్యి.. సముద్రంలోకి దూకాడు. దీంతో అత‌డు ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. .

అదే సమయంలో.. నేవీ తరువాత సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పైలట్‌ను రక్షించింది. ప్రస్తుతం పైలట్ పరిస్థితి నిలకడగా ఉంది. MiG-29 'K' ఫైటర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి బోర్డు ఆఫ్ ఎంక్వైరీ (BoI)ని ఆదేశించింది. ప్ర‌ముఖ వార్తా సంస్థ ANI ప్రకారం.. MiG-29K యుద్ధ విమానం గోవా తీరంలోని బేస్‌కు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో కూలిపోయిందని తెలుస్తుంది.  సాంకేతిక లోపంతో విమానం బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు కూడా తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu