మానవత్వం దాటుకున్న భారత సైన్యం! కొండ ప్రాంతంలో కారు ప్రమాదం.. క్షతగాత్రులను రక్షించిన ఆర్మీ.. 

Published : Dec 25, 2022, 04:13 AM IST
మానవత్వం దాటుకున్న భారత సైన్యం! కొండ ప్రాంతంలో కారు ప్రమాదం.. క్షతగాత్రులను రక్షించిన ఆర్మీ.. 

సారాంశం

 లడఖ్‌లో శనివారం కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇరుక్కుపోయారు. అయితే విషయం తెలిసిన వెంటనే ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ బయటకు తీశారు.

భారత సైన్యం యొక్క ధైర్యానికి, పరాక్రమానికి సాటి లేదు. అది శత్రు దేశాలతో యుద్ధమైనా, ప్రజలకు సహాయం చేయాలన్నా.. భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తాజాగా భారత ఆర్మీ మానవత్వాన్ని చాటుకుంది. లడఖ్‌లోని ఖర్దుంగ్లా సమీపంలో ఇరుక్కుపోయిన ఇద్దరు పౌరులను భారత ఆర్మీ సిబ్బంది సకాలంలో రక్షించారు. వారిని సైనిక సిబ్బంది సకాలంలో వైద్య సహాయం అందించారు. వారి ప్రాణాలు కాపాడారు. 

వివరాల్లోకెళ్తే.. శనివారం నాడు లడఖ్‌లోని దుర్గమమైన కొండలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు కారులో ఇరుక్కుపోయారు. అక్కడ గస్తీ కాస్తున్న ఇండియన్ ఆర్మీ సైనికులు వెంటనే స్పందించారు. వారిని కాపాడి  ఆసుపత్రిలో చేర్చారు. అదే సమయంలో లడఖ్ పోలీసుల సహకారంతో వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ (ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్) తెలిపింది.

భారత సైన్య  సేవ గుణాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. దీనికి సంబంధించి సమాచారం ఇస్తూ..భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ శనివారం లడఖ్‌లోని ఖర్దుంగ్లా టాప్ సమీపంలో కారు ప్రమాదానికి గురైందని తెలిపారు. అటువంటి పరిస్థితిలో, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాళ్ల మధ్యలో చిక్కుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న భారత ఆర్మీ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని వారిని  రక్షించారు. 

కారు ప్రమాదానికి గురికావడంతో కారులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఆర్మీ సిబ్బంది అతడిని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరికి ఎక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పౌరులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అతనికి ఆర్మీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ప్రకారం, లడఖ్ పోలీసుల సహాయంతో జవాన్లు ప్రమాదానికి గురైన కారును కూడా బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. మీడియా కథనాల ప్రకారం, కారు మంచు మీద జారడం వల్లే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం లడఖ్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భారత సైన్యం ఇలాంటి దాతృత్వం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలు మార్లు ఇండియన్ ఆర్మీ మానవత్వాన్ని చాటుకుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu