హైద్రాబాద్ విలీనం సర్దార్ పటేల్ ఘనతే: మోడీ

Published : Sep 17, 2019, 01:41 PM IST
హైద్రాబాద్ విలీనం సర్దార్ పటేల్ ఘనతే: మోడీ

సారాంశం

హైద్రాబాద్ ను ఇండియాలో విలీనం గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోజరిగిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గాంధీనగర్: హైద్రాబాద్ ను ఆనాడు భారత్‌లో విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లభాయ్‌పటేల్‌దేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు

గుజరాత్ రాష్ట్రంలో జరిగిన  బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు పాల్గొన్నారు.అభివృద్ధిలో ప్రస్తుతం హైద్రాబాద్  దేశానికి మార్గదర్శకంగా ఉందని ఆయన చెప్పారు.  

పటేల్ స్పూర్తితోనే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసినట్టుగా మోడీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లు అభివృద్ధి చెందుతాయని మోడీ ధీమాను వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో మరో 19 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు బిందు సేద్యంపై కేంద్రీకరిస్తున్న విషయాన్ని మోడీ ప్రకటించారు.తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport