జస్ట్ 1000 రూపాయలతో రూ. 35,800 కోట్ల సంపాదన.. సత్యనారాయణ్ నువాల్ సక్సెస్ స్టోరీ

Published : Sep 06, 2023, 03:41 PM IST
 జస్ట్ 1000 రూపాయలతో రూ. 35,800 కోట్ల సంపాదన.. సత్యనారాయణ్ నువాల్ సక్సెస్ స్టోరీ

సారాంశం

భారతీయ పారీశ్రామిక వేత్త సత్యనారాయణ్ నువాల్ కేవలం రూ.1000 తో రూ.35,800 కోట్ల సంస్థను స్థాపించాడు. ఈ వ్యక్తి ఊరికే విజయాన్ని అందుకోలేదు. ఇందుకోసం ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఉన్న విద్యను, ఉన్నత కుటుంబం నుంచే రావాల్సిన అవసరం లేదన్న ముచ్చటను మనం ఎంతో మందిని చూసి నేర్చుకోవచ్చు. భారతీయ బిలియనీర్ సత్యనారాయణ్ నువాల్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇతను 10 వ తరగతి చదవలేదు. కేవలం 1000 రూపాయలతో రూ.35,800  కోట్ల కంపెనీని స్థాపించాడు. ఈ భారతీయ పారిశ్రామికవేత్త విజయపథంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

సత్యనారాయణ నువాల్ ఎవరు?

అతని తండ్రి భిల్వారాలోని రాజస్థానీ గ్రామంలో ప్రభుత్వ అకౌంటెంట్‌గా పనిచేశాడు. అక్కడే సత్యనారాయణ నువాల్ పెరిగారు. అతను చదువు కంటే వ్యాపారం గురించి నేర్చుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కాబట్టి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత అతను తన గురువుతో ఒక సంవత్సరం గడిపాడు. అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి ఎంతో ప్రయత్నించాడు.

18 ఏళ్ల వయసులో ఎలాంటి అనుభవం లేకుండా కెమికల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో ప్రయత్నం చేశాడు. కానీ దానిలో పెద్దగా సక్సెస్ కాలేదు. తన 19వ ఏట సత్యనారాయణ్ నువాల్ వివాహం చేసుకుని మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఉంటూ 1977 వరకు ఎన్నో ఇబ్బందలును ఎదుర్కొన్నాడు.

చంద్రాపూర్ లో ఉన్న సమయంలో సత్యనారాయణ్ నువాల్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిత్యావసరాలు కొనే స్థోమత లేకపోవడంతో తరచూ రైల్వేస్టేషన్లలోనే పడుకునేవాడు. అయినప్పటికీ అతను ఆశను వదులుకోలేదు. అలాగే అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అబ్దుల్ సత్తార్ అల్లా భాయ్ తో పరిచయం పెంచింది.

అతనికి పేలుడు పదార్థాల లైసెన్స్, మ్యాగజైన్ ఉన్నప్పటికీ.. ఈ వనరులతో వ్యాపారాన్ని నిర్వహించడానికి అతనికి ఆసక్తి లేదు. అయితే సత్యనారయణ్ నువాల్‌కి ఇందులో వ్యాపార అవకాశం లభించింది.  1970లో నువాల్ పేలుడు మ్యాగజైన్‌లను రూ. 1000కి లీజుకు ఇవ్వడం ప్రారంభించాడు. బొగ్గు గనులలో ఉపయోగించేందుకు పేలుడు పదార్థాల కోసం వెతుకుతున్న ఖాతాదారుల నుంచి లాభం పొందడం ప్రారంభించాడు.

భారతదేశంలో అతిపెద్ద పేలుడు పదార్థాల డీలర్ గా మారడానికి ముందు సత్యనారాయణ్ నువాల్ చివరికి తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. కన్ సైన్ మెంట్ ఏజెంట్ గా మారాడు. చివరకు 1995లో సత్యనార్యన్ నువాల్ ఈ ఆలోచన చేసి సోలార్ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం నాగపూర్ లో ఉండేది. సోలార్ ఇండస్ట్రీస్ మొదట ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు గనులకు పేలుడు పదార్థాలను అందించింది.

ఆ తర్వాత సొంతంగా పేలుడు పదార్థాలను తయారు చేసుకుని రక్షణ రంగంలోకి ప్రవేశించింది. 2006లో ఆదాయం రూ.78 కోట్లు, నికరలాభం రూ.11 కోట్లకు చేరువలో ఉన్నప్పుడు కంపెనీని పబ్లిక్ లోకి తీసుకురావాలని భావించింది. సత్యనారాయణ్ నువాల్ ప్రధానంగా ఈ డబ్బును 29 ప్రదేశాలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, 13 అదనపు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడానికి ఉపయోగించారు.

మేకిన్ ఇండియాలో భాగంగా ప్రస్తుతం ఈ కంపెనీ పేలుడు పదార్థాలు, ప్రొపెల్లెంట్లు, గ్రెనేడ్లు, డ్రోన్లు, వార్ హెడ్లు తదితరాలను తయారు చేస్తోంది. ఒక దశాబ్దంలో సోలార్ పరిశ్రమ మార్కెట్ విలువ 1,700% పెరిగింది. 2012లో 1,765 కోట్ల నుంచి గత సంవత్సరం 35,000 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం.. నువాల్ 2.3 బిలియన్ డాలర్లు లేదా రూ. 19,000 కోట్లతో సంపన్న స్వీయ-నిర్మిత బిలియనీర్‌లలో ఒకరు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu