Hijab row: హిజాబ్ వివాదం.. ప‌రీక్ష‌లను బ‌హిష్క‌రించిన ముస్లిం విద్యార్థులు !

Published : Feb 14, 2022, 02:52 PM IST
Hijab row: హిజాబ్ వివాదం.. ప‌రీక్ష‌లను బ‌హిష్క‌రించిన ముస్లిం విద్యార్థులు !

సారాంశం

Hijab row: కర్నాట‌క‌లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లో రాజుకున్న హిజాబ్ వివాదం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే శివ‌మొగ్గ‌లోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో హిజాబ్ తొల‌గించి.. ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌డానికి ప‌లువురు ముస్లిం విద్యార్థులు నిరాకరించారు. ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించారు.   

Karnataka hijab row: కర్నాట‌క‌లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లో రాజుకున్న హిజాబ్  (Hijab) వివాదం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే శివ‌మొగ్గ‌లోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో హిజాబ్ తొల‌గించి.. ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌డానికి ప‌లువురు ముస్లిం విద్యార్థులు నిరాకరించారు. ఈ క్రమంలోనే ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించారు. వివ‌రాల్లోకెళ్తే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేప‌థ్యంలో కర్నాట‌క‌లో మూత‌ప‌డిన విద్యాసంస్థ‌లు సోమ‌వారం నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అత్యధిక ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించకుండా తరగతులకు హాజరైనప్పటికీ, శివమొగ్గ (Shivamogga) జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొల‌గించి.. హాజరు కావడానికి నిరాకరించారు. ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 

Karnataka  లోని శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పబ్లిక్ స్కూల్ (Government High School) లో విద్యార్థులను ఉపాధ్యాయులు అడ్డుకుని హిజాబ్‌ను తొలగించాలని కోరారు. అయితే విద్యార్థులు హిజాబ్‌ను తీసివేయ‌డానికి పూర్తిగా నిరాకరించారు. తమను పరీక్షలు రాయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు (SSLC-Class 10) రాయమని టీచర్లు, స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, విద్యార్థులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పరీక్షల‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా ఉండి హిజాబ్ (Hijab) లేకుండా తరగతులకు హాజరుకాలేమని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు.

హిజాబ్ (Hijab) కోసం పరీక్షను బహిష్కరించిన  ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. “కోర్టు ఇంకా పూర్తి ఆర్డర్ ఇవ్వలేదు, ఏది ఏమైనా మేము హిజాబ్‌ను తీసివేయము. పరీక్షలు రాయకపోయినా ఫర్వాలేదు. నాకు పరీక్షల కంటే సంస్కృతి ముఖ్యం. హిజాబ్ తప్పనిస‌రిగా లేకుండానే పాఠ‌శాల‌ల‌కు రావాలంటే మేము రాము. నా హిజాబ్‌ను విప్పమని అడిగితే, ఇంటికి తిరిగి రావాలని నా తల్లిదండ్రులు నన్ను కోరారు” అని చెప్పింది. అయితే, పాఠశాలలో చదువుతున్న మరో 100 మందికి పైగా ముస్లిం బాలికలు హిజాబ్  (Hijab) లేకుండా తరగతులకు హాజరయ్యారు.

కాగా, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య (Siddaramaiah) నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి హిజాబ్‌లు ధరించి అసెంబ్లీ ఉభయ సభలకు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) పరిపాలనలో రాజ్యాంగ విలువలు పతనమైనందుకు తాము నిరసన తెలుపుతున్నామని ఆ పార్టీ పేర్కొంది. తొలిరోజు సభకు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా హిజాబ్ ధరించి హాజరయ్యారు. ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న ఆమె, తాను హిజాబ్‌లో అసెంబ్లీ సమావేశానికి హాజరవుతానని చెప్పారు. ఇదిలావుండ‌గా, బీజేపీ ఎమ్మెల్సీ డీఎస్ అరుణ్ కాషాయ శాలువా ధ‌రించి మండలిలో పాల్గొన్నారు.

కాగా, ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత కొన్ని వారాల క్రితం క‌ర్నాట‌క‌లో  హిజాబ్  అంశం ఉద్రిక్త‌ల‌కు దారితీసింది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన కళాశాలలు, పాఠశాలల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని నిబంధనను జారీ చేసింది. ప్ర‌స్తుతం హిజాబ్ వ్య‌వ‌హారాన్ని క‌ర్నాట‌క హైకోర్టు విచార‌ణ జ‌రుపుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu