Hindu Rashtra: "భార‌త్ ను హిందూ రాష్ట్రంగా మార్చి తీరుతాం": బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్రమాణం

Published : May 03, 2022, 12:07 AM IST
Hindu Rashtra:  "భార‌త్ ను హిందూ రాష్ట్రంగా మార్చి తీరుతాం":  బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న  ప్రమాణం

సారాంశం

Hindu Rashtra: హర్యానాలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన ఎమ్మెల్యే  అసీమ్ గోయల్ ఇతరులతో కలిసి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని, దాని కోసం త్యాగాలు చేస్తానని ప్రమాణం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  

Hindu Rashtra: హర్యానాలో, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన ఒక ఎమ్మెల్యే ఇతర బీజేపీ అనుబంధ సంస్థ‌ల నాయ‌కులతో కలిసి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని, దాని కోసం త్యాగాలు చేస్తానని ప్రమాణం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 

అంబాలా సిటీ ఎమ్మెల్యే అసీమ్ గోయల్, ఇతరులు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి తాము కట్టుబడి ఉన్నామని వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేస్తాం అన్నారు.  క‌చ్చితంగా భార‌త దేశాన్ని హిందూ రాష్ట్రంగా  మార్చి తీరుతామ‌ని ఆయన అన్నారు. అంతేకాకుండా దీన్ని సాధించేందుకు మన పూర్వీకులు, దేవుళ్లు మనకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాని ఆయన అన్నారు. అయితే ఇదే ప్రమాణాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే అసీమ్ గోయల్ కూడా చేయడం జరిగింది. హిందూ దేశానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో పాటు ఎమ్మెల్యే చేతులు పైకెత్తడంతోపాటు ఇతరులకు మద్దతుగా నిలిచారు.

అదే సమయంలో ఎమ్మెల్యే అసీమ్ గోయెల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను బిజెపి ఎమ్మెల్యేగా కాకుండా హిందువుగా ఇతరులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశానని అన్నారు. హిందువునైనందుకు తాను  గర్విస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా యూనిఫాం సివిల్ కోడ్‌పై జరిగిన సెమినార్‌లో కూడా గోయల్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు బెదిరింపులు 
 
అంబాలా సిటీ ఎమ్మెల్యే అసీమ్ గోయల్ ఏప్రిల్ 18న ఓ ముస్లిం అనుబంధ సంస్థ బెదిరింపు లేఖ పంపింది. ఇందులో ఎమ్మెల్యే అసీమ్‌ను ముస్లిం వ్యతిరేకి అంటూ బెదిరించారు. ఎమ్మెల్యే ముస్లిం వ్యతిరేకి అని, ఎమ్మెల్యే ముస్లిం ప్రజలను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బెదిరింపు లేఖలో రాశారు. ఇటువంటి పరిస్థితిలో ముస్లీం చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి.  జిహాదీలంతా ఏకమయ్యామ‌ని,  ఎమ్మెల్యే అసీమ్ గోయల్ టార్గెట్ చేసిన‌ట్టు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.  

అయితే విషయం తీవ్రతను గమనించిన ఎమ్మెల్యే వెంటనే అంబాలా ఎస్పీకి విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌లు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అదే సమయంలో ఎమ్మెల్యేకు రాసిన లేఖ ఆధారంగా అంబాలాలోని బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
 
అంతకుముందు 2019లో, గోయెల్, అతని మద్దతుదారులు అప్పటి అంబాలా ఎస్పీ మోహిత్ హండా, పోలీసులపై ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో తనిఖీ చేస్తూ.. ప్రజలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు.. ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు 50కి పైగా నాకాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తన అభిప్రాయాన్ని వివరించేందుకు ప్రయత్నించారు.

గతేడాది డిసెంబరులో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో చవాన్‌కే ఇలాంటి ప్రసంగం చేశారు. గతంలో డిసెంబర్ 19న హిందూ యువ వాహిని కార్యక్రమంలో చావాన్‌కే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి చనిపోండి, చంపేయండి అని సామూహిక ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను చవాన్కే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో హిందువులు పొందుతున్న హక్కులనే భారతీయ ముస్లింలు పొందాలి. అంతకు మించి ఏమీ లేదు. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu