రామ్ లీలా మైదాన్ లో నేడు జరిగే కాంగ్రెస్ మెగా నిరసన "హల్లా బోల్ ర్యాలీ"కి ముందు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు ప్రజలు 10 సార్లు ఆలోచించాల్సిన నేటి పరిస్థితికి ప్రధాని మోడీ మాత్రమే బాధ్యత వహిస్తారని అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ: దేశంలో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు ఆకాశమేహద్దుగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఎందుర్కొంటున్న ఇబ్బందులు పెరుగుతున్నాయి. దేశంలో నేటి ఈ పరిస్థితులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రధాని మోడీ తన మిత్రులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ.. కేంద్ర బీజేపీ సర్కారు, ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానినే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలో ధరల పెరుగుదల, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలు, ప్రజా ఇబ్బందులు వంటి సమస్యలను గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో మెగా ఆందోళన "హల్లా బోల్ ర్యాలీ" నిర్వహిస్తోంది. రాహుల్ గాంధీ దీనిని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ మెగా నిరసన "హల్లా బోల్ ర్యాలీ"కి ముందు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు ప్రజలు 10 సార్లు ఆలోచించాల్సిన నేటి పరిస్థితికి ప్రధాని మోడీ మాత్రమే బాధ్యత వహిస్తారని అన్నారు. ప్రధాని మోడీని ఉద్దేశించి 'రాజు' తన స్నేహితులకు లాభం చేకూర్చడంలో మాత్రమే బీజీగా ఉన్నారని, ఈ రోజు ప్రజలు నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసే ముందు పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ధరల పెరుగుదలకు ప్రధాని మోడీని నిందించిన రాహుల్ గాంధీ, తాను, తమ పార్టీ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటామని చెప్పారు. 'రాజు వినాల్సి ఉంటుంది' అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
राजा मित्रों की कमाई में व्यस्त
प्रजा महंगाई से त्रस्त
आज, लोगों को ज़रूरत का सामान खरीदने से पहले भी दस बार सोचना पड़ रहा है। इन तकलीफों के लिए सिर्फ प्रधानमंत्री ज़िम्मेदार हैं।
हम महंगाई के खिलाफ आवाज़ें जोड़ते जाएंगे, राजा को सुनना ही पड़ेगा।
సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించనున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల మేర సాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు హల్లా బోల్ ర్యాలీ నాందికానుంది. కాగా, రాహుల్ గాంధీ ఆగస్టు చివరి వారం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి ఇటలీలో ఉన్నారు. సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఆగస్టు 27న కన్నుమూశారు. ర్యాలీకి ముందుగా ఆయన ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. గులాం నబీ ఆజాద్ పార్టీ నుండి వైదొలగిన తరువాత రాహుల్ గాంధీ నాయకత్వంపై చాలా ఎక్కువ మాట్లాడినందున ఈ రోజు రాహుల్ గాంధీ హాజరు కావడం కూడా పార్టీకి కీలకం. పార్టీ ఎన్నికల పరాజయానికి రాహుల్ గాంధీ, అతని నాయకత్వమే కారణమని ఆజాద్ ఆరోపించాడు. ఆయనను 'నాన్-సీరియస్' నాయకుడిగా అభివర్ణించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నందున, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్ పార్టీ అంతర్గత నుండి పెరుగుతోంది. మనీష్ తివారీ, శశి థరూర్, ప్రద్యుత్ బోర్డోలోయ్ ఓటర్ల జాబితాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.