Gyanvapi: జ్ఞానవాపి వివాదం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుండి దృష్టి మరల్చే ప్రయత్నం: శరద్ పవార్

Published : May 22, 2022, 05:57 AM IST
Gyanvapi: జ్ఞానవాపి వివాదం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుండి దృష్టి మరల్చే ప్రయత్నం: శరద్ పవార్

సారాంశం

Sharad Pawar On Gyanvapi: మహారాష్ట్రలోని బ్రాహ్మణ సంస్థల ప్రతినిధులతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదు వివాదం గురించి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   

inflation, unemployment: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శాంతి భద్రతల వంటి ప్రాథమిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేస్తున్న ప్రయత్నాలలో భాగమే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. దేశంలో నెల‌కొన్న అనేక స‌మ‌స్య‌ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రంలోని అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి సమస్యలను లేవనెత్తుతుందని అన్నారు. మహారాష్ట్రలోని బ్రాహ్మణ సంస్థల ప్రతినిధులతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదు వివాదం గురించి స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. జ్ఞానవాపి వివాదం వివిధ వర్గాల మధ్య అశాంతిని సృష్టించడానికి ఉద్దేశపూర్వక  చేస్తున్న ప్రయత్నం అని శ‌ర‌ద్ ప‌వార్ ఆరోపించారు. 

అలాగే, తమ పార్టీ సభ్యులు చేస్తున్న కొన్ని ప్రకటనల వల్ల సంఘం నేతలు కలత చెందుతున్నారని కూడా తెలిపారు. ఎన్సీపీ నేతల కొన్ని ప్రకటనలు వారిలో అశాంతికి గురిచేశాయని, మా నేతలతో సమావేశం నిర్వహించి ఇతర కులాలు, వర్గాల గురించి మాట్లాడకూడదని చెప్పన‌ని తెలిపారు. ఇతర కులాలు, సంఘాలు, మ‌తాల గురించి మాట్లాడకూడదని త‌మ పార్టీ సభ్యులకు చెప్పానని ఆయన స్ప‌ష్టం చేశారు. కొన్ని బ్రాహ్మణ సంస్థలు సమాజానికి మరిన్ని ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నాయని కూడా చెప్పారు. ఉద్యోగాల్లో ఈ సామాజికవర్గానికి మంచి ప్రాతినిథ్యం ఉందని గణాంకాలు చెబుతున్నందున రిజర్వేషన్లు వారికి పరిష్కారం కాదని ఆయన వారికి చెప్పారు. ఎవరికీ రిజర్వేషన్ ఇవ్వకూడదని చెబుతూనే.. కొందరికి రిజర్వేషన్లు రావాలని పేర్కొన్నారు.

బ్రాహ్మ‌ణ వ‌ర్గాల అభివృద్ధి కోసం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ, దీని గురించి ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేతో చ‌ర్చిస్తాన‌ని తెలిపారు.  బ్రాహ్మణ నాయకులు కూడా పరశురామ్ మహామండల్ (నిగం) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత తనతో చెప్పారని, అయితే తనకు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చార‌ని సంబంధ నాయ‌కులు పేర్కొన్నారు. 

ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ పై సుంకాలు తగ్గిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనపై ప్రజలను అంకెల గారడీతో తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది కానీ.. రెండు నెలల క్రితం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.18.42 పెంచిన కేంద్ర ప్రభుత్వం నేడు రూ.8 తగ్గిస్తున్నట్లు ప్రకటించడం తీరు ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా? అని మండిప‌డ్డారు. అదే విధంగా డీజిల్ పై రూ.18 నుంచి 24 పైసలు ఎక్సైజ్ సుంకం పెంచగా, ఇప్పుడు రూ.6 తగ్గిస్తున్నట్లు ప్రకటించార‌ని అన్నారు. ముందుగా ధరలు పెంచి ఆ తర్వాత పేరును తగ్గించి చీప్ పాపులారిటీ పొందడం సరికాద‌ని హిత‌వు ప‌లికారు.  పౌరులకు నిజమైన అర్థంలో ఉపశమనం లభించాలంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 6 నుండి 7 సంవత్సరాల క్రితం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu