పగ తీర్చుకోవడానికి సొంత మనవరాలినే చంపేసిన బామ్మ.. !

Published : Jun 10, 2021, 05:09 PM IST
పగ తీర్చుకోవడానికి సొంత మనవరాలినే చంపేసిన బామ్మ.. !

సారాంశం

పగ తీర్చుకోవాలన్న కసి ఆ బామ్మలో విచక్షణను చంపేసింది. తన మూడేళ్ల మనవరాలినే దారుణంగా చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని బరన్ లో జరిగింది. 

పగ తీర్చుకోవాలన్న కసి ఆ బామ్మలో విచక్షణను చంపేసింది. తన మూడేళ్ల మనవరాలినే దారుణంగా చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని బరన్ లో జరిగింది. 

తన విరోధికి ఎలాగైన బుద్ది చెప్పాలనుకున్న ఓ వృద్ధురాలు తన కుటుంబంలోనే నిప్పులు పోసుకుంది. విచక్షణ కోల్పోయిన ఆమె తన శత్రువుమీద పగ తీర్చుకునే క్రమంలో మూడేళ్ల వయసున్న తన మనవరాలిని ఆమె బలి తీసుకుంది. రాజస్థాన్ బరన్ జిల్లాలలో ఈ దారుణం జరిగింది.

బోరినా గ్రామానికి చెందిన కనకబాయ్, ఆమె కుటుంబసభ్యులకు అదే గ్రామానికి చెందిన రామేశ్వర్ మోగ్యా కుటుంబానికి మధ్య నీళ్ల విషయం మీద కొన్ని విభేదాలు ఉండేవి. రెండు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య ఈ విషయమై పెద్ద గొడవ జరిగింది. 

ఇందులో కనకబాయి మనవరాలితో పాటు రామేశ్వర్ మోగ్యా కూతురు కూడా గాయపడింది. ఆ తరువాత పోలీసు కేసు పెడతానంటూ కనకబాయి రామేశ్వర్ మోగ్యాను బెదిరించింది. దీంతో అతడు పారిపోయాడు. 

ఈ క్రమంలో కనకబాయ్ తన మనవరాలిని చంపేసి రామేశ్వర్ మోగ్యామీద ఈ నేరాన్ని నెట్టేసింది. పోలీసు కేసు కూడా పెట్టింది. అయితే దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు కనకబాయ్ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారు ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్