గుండె‌జబ్బుతో బాధపడుతున్న మనవరాలిపై తాత అత్యాచారయత్నం..ఆసుపత్రిలోనే

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 11:23 AM IST
గుండె‌జబ్బుతో బాధపడుతున్న మనవరాలిపై తాత అత్యాచారయత్నం..ఆసుపత్రిలోనే

సారాంశం

గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత.

గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత. మరాఠ్వాడలోని హింగోలికి చెందిన ఓ చిన్నారి తల్లి మరణించడంతో ఆమె అనాథగా మారింది. దీంతో బంధువులు ఆ పాపను అనాథాశ్రమంలో చేర్పించారు.

అయితే ఆమెకు గుండెలో రంధ్రం పడటంతో శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి... చిన్నారి తాతకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి వార్డులో ఎవ్వరూ లేని సమయంలో తాతయ్య.. పాపను అసభ్యంగా తాకుతూ.. అత్యాచారయత్నం చేయబోయాడు.

ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.. నర్సు వచ్చి ఏం జరిగిందని చెప్పడంతో ఆ చిన్నారి తాత తనను ఎలా తాకాడో చెప్పింది. జరిగినది అర్థం చేసుకున్న నర్స్ తాతయ్యపై ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారిచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తాతను అదుపులోకి తీసుకుని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజు చిన్నారికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు