గుండె‌జబ్బుతో బాధపడుతున్న మనవరాలిపై తాత అత్యాచారయత్నం..ఆసుపత్రిలోనే

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 11:23 AM IST
గుండె‌జబ్బుతో బాధపడుతున్న మనవరాలిపై తాత అత్యాచారయత్నం..ఆసుపత్రిలోనే

సారాంశం

గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత.

గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత. మరాఠ్వాడలోని హింగోలికి చెందిన ఓ చిన్నారి తల్లి మరణించడంతో ఆమె అనాథగా మారింది. దీంతో బంధువులు ఆ పాపను అనాథాశ్రమంలో చేర్పించారు.

అయితే ఆమెకు గుండెలో రంధ్రం పడటంతో శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి... చిన్నారి తాతకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి వార్డులో ఎవ్వరూ లేని సమయంలో తాతయ్య.. పాపను అసభ్యంగా తాకుతూ.. అత్యాచారయత్నం చేయబోయాడు.

ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.. నర్సు వచ్చి ఏం జరిగిందని చెప్పడంతో ఆ చిన్నారి తాత తనను ఎలా తాకాడో చెప్పింది. జరిగినది అర్థం చేసుకున్న నర్స్ తాతయ్యపై ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారిచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తాతను అదుపులోకి తీసుకుని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజు చిన్నారికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu