నన్ను ఎవరు చూడర్లే అనుకున్నాడు.. ఏకంగా సీఎం చూశారు

By Siva KodatiFirst Published Jun 11, 2019, 5:45 PM IST
Highlights

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే తెలిసిన వారో.. లేదంటే చుట్టుపక్కల వారో మనల్ని మందలిస్తూ ఉంటారు అలాంటిది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందలిస్తే. 

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే తెలిసిన వారో.. లేదంటే చుట్టుపక్కల వారో మనల్ని మందలిస్తూ ఉంటారు అలాంటిది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందలిస్తే. వివరాల్లోకి వెళితే... గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్నారు.

ఈ సమయంలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి  కంభార్జువా నదిలో చెత్తపారేయటం ముఖ్యమంత్రి గమనించారు. అంతే వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి... నదిలో చెత్తను పారేయవద్దని సదరు వ్యక్తిని మందలించారు.

నదుల్ని కలుషితం చేయొద్దని.. బాధ్యతగల పౌరుడిగా ప్రవర్తించాలని సూచించారు. ఈ తతంగాన్ని సావంత్ తన ట్వీట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనను ప్రశంసించారు.

Earlier today, while travelling over Gaundalim bridge, came across a citizen who was disposing nirmalya in the river. I requested him to desist from doing so. As responsible citizens we need to begin disposing wastes properly and also educate & guide our fellow citizens to do so. pic.twitter.com/v2zSLCCkxe

— Dr. Pramod Sawant (@DrPramodPSawant)
click me!