గోవా టు ప్రయాగరాజ్: కుంభమేళా ప్రత్యేక రైళ్లు ప్రారంభం

Published : Feb 06, 2025, 11:42 PM IST
గోవా టు ప్రయాగరాజ్:  కుంభమేళా ప్రత్యేక రైళ్లు ప్రారంభం

సారాంశం

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మహా కుంభమేళా 2025కి తొలి తీర్థయాత్ర రైలుని ప్రారంభించారు.  

Kumbh Mela 2025 : ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 అత్యంత అట్టహాసంగా సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ దివ్య, భవ్య కార్యక్రమానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రాష్ట్ర ప్రభుత్వ 'ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యాత్రా యోజన' కింద తొలి తీర్థయాత్ర రైలుని ప్రయాగరాజ్‌కు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహా కుంభ ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు.

మహా కుంభ 2025 ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమం అని... 40 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతున్నారని... ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ దీన్ని విజయవంతం చేయడానికి అద్భుత ఏర్పాట్లు చేశారని, గోవా తీర్థయాత్రికులకు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడం గర్వంగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను కూడా ప్రశంసించారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలి... ప్రధాని మోదీ ఈ దిశగా అద్భుతమైన పని చేశారన్నారు. రాబోయే తరాలకు మన వారసత్వాన్ని పరిచయం చేస్తూ, అభివృద్ధి చెందిన భారత్ 2047 లక్ష్యం వైపు పయనిస్తున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 13, 21న రెండు అదనపు రైళ్లు

కాంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో నడుస్తున్న ఈ ప్రత్యేక రైలు మహా కుంభ 2025కి తీర్థయాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన మూడు రైళ్లలో మొదటిది. ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో పాటు సంక్షేమ శాఖ మంత్రి సుభాష్ ఫాల్దేశాయి, గోవా బీజేపీ అధ్యక్షుడు దామూ నాయక్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

మహా కుంభ 2025కి తీర్థయాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఫిబ్రవరి 13, 21 తేదీల్లో ఉదయం 8 గంటలకు మడగావ్ రైల్వే స్టేషన్ నుండి రెండు అదనపు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. ప్రతి రైలులో 1,000 మంది తీర్థయాత్రికులకు సీటింగ్ సౌకర్యం ఉంటుంది. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు గల, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని అర్హులైన ప్రయాణికులు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సీట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక యాత్రను సాధ్యం చేసినందుకు తీర్థయాత్రికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, "ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఇంత పెద్ద మహా కుంభను నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌జీని అభినందిస్తున్నాను. 40 కోట్లకు పైగా ప్రజలకు ఏర్పాట్లు చేయడం గొప్ప విజయం. గోవా ప్రభుత్వం తరపున, ఈ చారిత్రక కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము" అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్