కేరళలో 200 రూపాయలకే గ్యాస్ కనెక్షన్

Published : Aug 31, 2018, 01:20 PM ISTUpdated : Sep 09, 2018, 01:20 PM IST
కేరళలో 200 రూపాయలకే గ్యాస్ కనెక్షన్

సారాంశం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో వరదల్లో ఎల్పీజీ సిలిండర్లు కోల్పోయిన వారికి కేవలం రూ. 200లకే ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ వెల్లడించారు.

వరదల ప్రాంతం తప్పించి మిగిలిన ప్రాంతాల ప్రజలకు రూ.1200లకు కనెక్షన్ ఇస్తారని ఆయన తెలిపారు. వరద బాధితులకు తక్షణం కొత్త  గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Mobile Tower Theft: ఈ దొంగల రూటే వేరబ్బా.. రాత్రికి రాత్రే 132 అడుగుల టవర్ మాయం ! పోలీసులకే మైండ్ బ్లాక్
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !