G20 Summit 2023: భారత్ మండపంలో సందర్శకులకు ప్రత్యేక అనుభూతినిచ్చేలా స్టాల్స్.. (వీడియో)

Published : Sep 08, 2023, 12:49 PM IST
G20 Summit 2023: భారత్ మండపంలో సందర్శకులకు ప్రత్యేక అనుభూతినిచ్చేలా స్టాల్స్.. (వీడియో)

సారాంశం

జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేసింది. దేశ రాజధాని దిల్లీలో కొత్తగా ప్రారంభించిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది.

జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేసింది. దేశ రాజధాని దిల్లీలో కొత్తగా ప్రారంభించిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశం సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి జీ సదస్సు సందర్భంగా భారత్ మండపంలో వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రదర్శనలు సందర్శకులకు అనేక విశిష్టమైన అనుభవాలను అందించనున్నాయి.  జీ20 సదస్సుకు వేదికైన భారత్ మండపం ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్ .. ‘కల్చర్ కారిడార్ - G20 డిజిటల్ మ్యూజియం’ని ప్రదర్శిస్తుంది.

ఈ కల్చరల్ కారిడార్ G20 సభ్యులు, ఆహ్వానిత దేశాల భాగస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింబించనుంది. ఇది జీ20 సభ్యుల, 9 ఆహ్వానిత దేశాల ఐకానిక్, గుర్తించదగిన సాంస్కృతిక వస్తువులు, వారసత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కల్చర్ కారిడార్ విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణల అవగాహన, ప్రశంసలను ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడం, చేరిక, సమానత్వం కోసం, భాగస్వామ్య గుర్తింపు యొక్క భావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుంది.

డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ జోన్..
హాల్ 4 , హాల్ 14లో ఏర్పాటు చేయబడిన డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ జోన్. భారతదేశం అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క శక్తిని ప్రత్యక్షంగా అనుభవించడానికి సందర్శకులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించనుంది. డిజిటల్ ఇండియా కీలకమైన కార్యక్రమాలపై ఈ జోన్ కీలక అంతర్దృష్టులను అందిస్తుంది. ప్రదర్శించబడుతున్న కార్యక్రమాలలో ఆధార్, డిజిలాకర్, యూపీఐ, ఇ-సంజీవని, దీక్ష, భాషిణి, ఓఎన్‌డీసీ, Ask GITA ఉన్నాయి. ఆస్క్ గీతా.. మార్గదర్శకత్వం, ప్రేరణ, పరివర్తన, చర్య - భగవద్గీత పురాతన జ్ఞానాన్ని అత్యాధునిక AI సాంకేతికతతో మిళితం చేస్తుంది. ఈ జోన్‌లో MyGov, CoWIN, UMANG, జన్‌ధన్, e NAM, GSTN, FastTag‌తో పాటు ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి.

 

ఆర్‌బీఐ ఇన్నోవేషన్ పెవిలియన్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జీ20 సదస్సులో అత్యాధునిక ఆర్థిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది. ఆర్థిక రంగాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆర్థిక రంగంలో భారతదేశం ఆవిష్కరణ ప్రత్యేక కోణాలను ప్రదర్శించే ఉత్పత్తులను ఇది కలిగి ఉంటుంది. వీటిలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, డిజిటలైజ్డ్ పేపర్‌లెస్ పద్ధతిలో రుణాన్ని అందించడానికి సాంకేతికతను ఉపయోగించి ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్, యూపీఐ వన్ వరల్డ్, రూపే ఆన్ ది జీఓ,  భారత్ బిల్లు పేమెంట్స్ ద్వారా క్రాస్ బోర్డర్ బిల్లు చెల్లింపు వంటి ప్రత్యేక చెల్లింపు సిస్టమ్ ఉత్పత్తులు ఉంటాయి. 

పేమెంట్ సిస్టమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్..
యూపీఐ వన్ వరల్డ్ అనేది భారతదేశంలో బ్యాంక్ ఖాతాలు లేని ఇన్‌బౌండ్ విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించబడిన యూపీఐ. విదేశీ పౌరులు భారతదేశంలో ఉన్న సమయంలో ఉచిత, సురక్షితమైన చెల్లింపులను అనుభవించడానికి యూపీఐ లింక్ చేయబడిన ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాన్ని తెరవాల్సి ఉంటుంది. యూపీఐ వన్ వరల్డ్‌లో ప్రతినిధులు ప్రవేశిస్తారు. వారి వాలెట్లకు రూ. 2000 ప్రీఫండ్ చేయబడుతుంది. దానిని వారు కోరుకున్న విధంగా వినియోగించుకోవచ్చు.

 

క్రాఫ్ట్స్ బజార్..
హాల్ నంబర్ 3లో భారత్ మండపం వద్ద ‘క్రాఫ్ట్స్ బజార్’ ఏర్పాటు చేస్తున్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, జీఐ ట్యాగ్ చేయబడిన వస్తువులపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇది స్థానికంగా లభించే ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశాన్ని ప్రతినిధులకు అందిస్తుంది. దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అలాగే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్, TRIFED మొదలైన కేంద్ర ఏజెన్సీలు క్రాఫ్ట్స్ బజార్‌లో పాల్గొంటాయి. హస్తకళాకారుల నైపుణ్యాలు, అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించడానికి, మాస్టర్ హస్తకళాకారులచే ప్రత్యేక ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా ప్రణాళిక చేయబడ్డాయి.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu