బీజేపీ నేత కుటుంబం ఆత్మహత్య... కొడుకు మరణాన్ని తట్టుకోలేకే..

By AN TeluguFirst Published Feb 22, 2021, 9:22 AM IST
Highlights

రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సికార్ జిల్లాలోని  సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఇలా ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపింది. 

రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సికార్ జిల్లాలోని  సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఇలా ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపింది. 

ప్రాథమిక దర్యాప్తులో వెలువడిన వివరాల ప్రకారం..  ఇటీవల వీరి కుటుంబంలో ఓ సభ్యుడు చనిపోయాడు.. ఈ బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్ లాల్ భార్య, తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు.  

మదన్ లాల్ పెద్ద కుమారుడు గత ఏడాది సెప్టెంబర్ లో చనిపోయాడు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపధ్యం లోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మదన్ లాల్ సోదరుని కుమారుడు మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా అనుకుంటున్న సూసైడ్ నోట్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు. 
 

click me!