మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్.. నెక్స్ టార్గెట్ ఎవరంటే..?

Published : Jul 10, 2023, 02:54 AM IST
మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్.. నెక్స్ టార్గెట్ ఎవరంటే..?

సారాంశం

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ సోనీపై రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకున్న విజిలెన్స్ బ్యూరో మాజీ ఉపముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసింది. 

Punjab Deputy CM OP Soni: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ సోనీపై రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకున్న విజిలెన్స్ బ్యూరో మాజీ ఉపముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసింది. 

విజిలెన్స్ బ్యూరో ప్రకారం..  2016 నుంచి 2022 మధ్య కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని ఆదివారం అరెస్టు చేసింది. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు విజిలెన్స్ బృందం అధికారి తెలిపారు. ఓపీ సోనీని సోమవారం అమృత్‌సర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. చన్నీ ప్రభుత్వంలో ఓపీ సోనీ డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు.

2016 నుంచి 2022 వరకు కాలంలో ఆయన  ఆదాయం రూ.4,52,18,771 కాగా, ఖర్చు రూ.12,48,42,692 అని విజిలెన్స్ బృందం అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఓపీ సోనీ తన భార్య సుమన్ సోనీ, కుమారుడు రాఘవ్ సోనీ పేరిట ఆస్తులు సృష్టించారని తెలిపారు.

విచారణ అనంతరం ఓపీ సోనీపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1) (బి) , 13 (2) కింద పోలీస్ స్టేషన్ విజిలెన్స్ బ్యూరో, అమృత్‌సర్ రేంజ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు విజిలెన్స్ బృందం ప్రతినిధి తెలిపారు. ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మాజీ డిప్యూటీ సీఎం ఓం ప్రకాశ్‌ సోనీపై సుదీర్ఘకాలంగా విచారణ కొనసాగుతోంది. నవంబర్ 8న చండీగఢ్‌లో ఆయనపై అక్రమ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓంప్రకాష్ సోనీ తన పదవిని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఓం ప్రకాష్ సోనీ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో వైద్య విద్య మరియు పరిశోధన శాఖ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. చన్నీ ప్రభుత్వంలో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి శాఖల బాధ్యతలు అప్పగించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ సెంట్రల్ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపొందారు.  

చన్నీపై ఆరోపణలు 

ఓపీ సోనీ మాత్రమే కాదు.. ఆదాయానికి మించిన ఆస్తులపై పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై  విజిలెన్స్ బ్యూరో  విచారణ జరుపుతోంది. తాజాగా విజిలెన్స్ బ్యూరో ఈ వారం చన్నీని విచారించింది. మొహాలీలో ఈ విచారణకు ముందు.. ఏప్రిల్ , జూన్ ల్లో చన్నీని రెండుసార్లు విచారించింది.

విచారణలో తనకు రెండు ఇళ్లు, రెండు ఆఫీసులు, ఒక దుకాణం మాత్రమే ఉన్నాయని చన్నీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బ్యూరోకు తెలిపారు. భగవంత్ మాన్ తన పరువు తీశాడని ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై చన్నీ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆస్తులపై విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu