తమిళనాడు కృష్ణగిరిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు

Published : Feb 23, 2023, 11:12 AM ISTUpdated : Feb 23, 2023, 11:53 AM IST
తమిళనాడు  కృష్ణగిరిలో  రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు

సారాంశం

తమిళనాడు  రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో  రోడ్డు ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో  ఐదుగురు మృతి  చెందారు. 

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని  కృష్ణగిరి జిల్లా  కావేరిపట్నంలో  గురువారంనాడు  రోడ్డు  ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  మరో  ఆరుగురు  గాయపడ్డారు.ట్రాక్టర్ ను మినీ బస్సు ఢీకొంది. దీంతో  ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని  స్థానికంగా  ఉన్న ఆసుపత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా  ప్రతి రోజూ  ఏదో ఒక చోట  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే  ఉన్నాయి.  డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, వాహనంపై  నియంత్రణ కోల్పోవడం  వంటి  అంశాలు  ప్రమాదాలకు  కారణంగా మారుతున్నాయి. మరో వైపు మద్యం మత్తులో  వాహనాలు  నడపడం కూడా ప్రమాదాలకు  కారణాలుగా  పోలీసులు  చెబుతున్నారు.   రోడ్డు ప్రమాదాలు తరచుగా  జరిగే  ప్రదేశాలను గుర్తించి  ప్రమాదాల నివారణకు  కూడా  అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పార్వతీపురం  మన్యం జిల్లాలో  ఈ నెల  22న  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు.  ఆటో , లారీ ఢీకొన్నాయి.  ఈ ఘటనలో  ఆరుగురు మృతి చెందితే  మరో ఇద్దరు గాయపడ్డారు.  పెళ్లికి  తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  ఈ నెల  14న  శ్రీకాకుళం జిల్లాలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  నవ దంపతులు  మృతి చెందారు . బైక్ పై వెళ్తున్న దంపతులను  ట్రాక్టర్ ఢీకొట్టింది.  ఈ ఘటనలో  నవ దంపతులు  మృతి చెందారు. 

ఈ నెల  16న  తెలంగాణ రాష్ట్రంలోని  యాదాద్రి భువనగిరి జిల్లాలోని  చౌటుప్పల్ మండలం  దండు మల్కాపురం వద్ద  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. ఆటో, ప్రైవేట్  బస్సు ఢీకొనడంతో  ఈ ప్రమాదం  జరిగింది. 

ఈ నెల  22న మహరాష్ట్రలోని పుణెలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి  చెందిన  నలుగురు మృతి చెందారు.  ఈ నెల  21న  మేఘాలయలోని నార్త్ ‌గారోహిల్స్  లో  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు