తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

Published : Sep 04, 2020, 01:28 PM IST
తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

సారాంశం

 తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చనిపోయినవారంతా మహిళలేనని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు కారణంగా భవనం కుప్పకూలిపోయింది. 

భవనం శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలు కూడ చెల్లా చెదురుగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిక తరలించారు. ఈ ప్రమాదానికి గల  కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. 

గతంలో కూడ బాణసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నా కూడ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగా పదే పదే ఇదే తరహాలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


 

PREV
click me!

Recommended Stories

Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!
IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!