తమిళనాడు బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు, 4 మృతి, 20 మందికి గాయాలు..

Published : Jul 29, 2023, 10:38 AM IST
తమిళనాడు బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు, 4 మృతి, 20 మందికి గాయాలు..

సారాంశం

తమిళనాడులో ఓ బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. 

తమిళనాడు : తమిళనాడులో బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్ జరిగింది. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు దాటికి సమీపంలోని ఐదు ఇల్లు ధ్వంసమయ్యాయి.

 శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీపేలుడు ధాటికి శరీరాలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

బాణాసంచాను ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

CJP Protest : కాక్రోచ్ జనతా పార్టీకి బుధాదిత్య రాజయోగం... భవిష్యత్ లో ఏం జరగబోతోందో చెప్పేసిన వేణుస్వామి
Modi World Record : ఫ్రెండ్స్ అంటూ ట్రెండ్ సెట్ చేసిన మోదీ... జెన్-జి ల సపోర్ట్ తో ఫిఫా రికార్డ్ బ్రేక్