తమిళనాడు బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు, 4 మృతి, 20 మందికి గాయాలు..

Published : Jul 29, 2023, 10:38 AM IST
తమిళనాడు బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు, 4 మృతి, 20 మందికి గాయాలు..

సారాంశం

తమిళనాడులో ఓ బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. 

తమిళనాడు : తమిళనాడులో బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్ జరిగింది. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు దాటికి సమీపంలోని ఐదు ఇల్లు ధ్వంసమయ్యాయి.

 శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీపేలుడు ధాటికి శరీరాలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

బాణాసంచాను ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం