కాన్పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం: 500 బట్టల దుకాణాల్లో మంటలు

Published : Mar 31, 2023, 10:40 AM IST
కాన్పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం:  500 బట్టల దుకాణాల్లో  మంటలు

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  కాన్పూర్ లో  బాస్మండి ప్రాంతంలో  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  


లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  కాన్పూర్ లో ని బాస్మండి  ప్రాంతంలో  శుక్రవారంనాడు తెల్లవారుజామున  భారీ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  సుమారు  500 బట్టల దుకాణాల్లో  అగ్ని ప్రమాదం  నెలకొంది. ఎఆర్  టవర్ వద్ద  మంటలు  చెలరేగాయి.  ఈ మంటలు  పక్కనే ఉన్న కాంప్లెక్స్ లకు  వ్యాపించాయి.  మసూద్ టవర్ -1 , మసూద్  టవర్ 2,   హమ్రాజ్ కాంప్లెక్స్ లకు  మంటలు వ్యాపించాయి.  ఈ విషయం తెలిసిన వెంటనే  మంటలను ఆర్పేందుకు  అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు . సుమారు  25 ఫైరింజన్లు మంటలను  ఆర్పుతున్నాయి.  పండుగల సమయంలో  విక్రయించేందుకు  సిద్దంగా  ఉంచిన బట్టలు  ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయి. 
ఈ అగ్ని ప్రమాదానికి  కారణాలు తెలియరాలేదు.  అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా  మంటలు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు .
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌