ప్యారెల్ క్రిస్టల్ టవర్ లో మంటలు: నలుగురు మృతి

Published : Aug 22, 2018, 10:11 AM ISTUpdated : Sep 09, 2018, 11:07 AM IST
ప్యారెల్ క్రిస్టల్ టవర్ లో మంటలు: నలుగురు మృతి

సారాంశం

ముంబైలోని పారెల్ వద్ద గల హింద్ మత సినిమా వద్ద ఉన్న క్రిస్టల్ టవర్ రెసిడెన్షియల్ అపార్టుమెంటులోని 12వ అంతస్థులు మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ముంబై: ముంబైలోని పారెల్ వద్ద గల హింద్ మత సినిమా వద్ద ఉన్న క్రిస్టల్ టవర్ రెసిడెన్షియల్ అపార్టుమెంటులోని 12వ అంతస్థులు మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉంది.

సంఘటనా స్థలానికి 20 ఫైర్ టెండర్స్ చేరుకున్నాయి. అవి మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. అపార్టుమెంటు లోపల నివాసితులు చిక్కుకున్నారు. క్రేన్ ల సహాయంతో వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

లోపలి నుంచి బయటకు తీసినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం 12వ అంతస్థులో ప్రారంభమైన మంటలు 14, 15 అంతస్థులకు వ్యాపించాయి.

మొత్తం 20 మంది బాధితులను కెఈఎం ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురు మరణించారు. మిగతా 16 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమేమిటనేది తెలియదు.

 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?