ఛీ..ఛీ.. దారుణం..16యేళ్ల బాలిక మీద రెండేళ్లుగా తండ్రి, అన్న లైంగిక దాడి...

By SumaBala BukkaFirst Published Jan 20, 2022, 12:51 PM IST
Highlights

2019, జనవరి 25న ఇంట్లో నిద్రపోతున్న తన మీద అన్న అఘాయిత్యానికి ఒడిగట్టాడని, అంతకుముందే ఓసారి ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్యాక్టరీలో ఉండగా తండ్రి లైంగికంగా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత పలుమార్లు దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి తండ్రి (43), సోదరుడు (20)పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ముంబై : ఓ 16యేళ్ల బాలిక మీద సొంత father, brotherలే లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండేళ్లుగా వారి అకృత్యాలను భరిస్తూ వస్తున్న బాలిక.. చివరికి తన teacherలకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన maharashtra రాజధాని ముంబైలోని Dharaviలో జరిగింది. 2019 నుంచి తన మీద తండ్రి, సోదరుడు molestationకి పాల్పడుతున్నారని తన పాఠశాలలోని ప్రధానోపాధ్యురాలికి బాలిక తెలిపింది. ఆ తరువాత ఉపాధ్యాయులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2019, జనవరి 25న ఇంట్లో నిద్రపోతున్న తన మీద అన్న అఘాయిత్యానికి ఒడిగట్టాడని, అంతకుముందే ఓసారి ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్యాక్టరీలో ఉండగా తండ్రి లైంగికంగా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత పలుమార్లు దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి తండ్రి (43), సోదరుడు (20)పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

ఇలాంటి ఘటనలు రోజూ ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. జనవరి 6న కూడా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి liquor మత్తులో minor అయిన కన్న కూతురిపై రెండోసారి rapeకి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం uttarpradesh నుంచి 12 ఏళ్ళక్రితం ఓ కుటుంబం తాడేపల్లికి వలస వచ్చి మహానాడు లోని ఓ కాలనీ లో ఉంటుంది. భర్త సీలింగ్ పనులు చేస్తుండగా... భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే ఉంటుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.

రెండో కుమార్తె వయసు పదకొండేళ్లు,  దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.  తెల్లవారుజామున తండ్రి కూతురి మీద అత్యాచారానికి పాల్పడగా…  పెద్దగా కేకలు వేయడంతో నిద్రపోతున్న తల్లి లేచింది.  అక్కడి దృశ్యం చూసి పెద్దగా అరవడంతో భర్త పారిపోయాడు. మనస్థాపంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతుండగా పెద్దకొడుకు అడ్డుకున్నాడు.  

ఆ తర్వాత స్థానికుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త ఇలా అఘాయిత్యానికి తెగడబడడం ఇది మొదటి సారి కాదని..  ఏడాది క్రితం తన భర్త కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని  బయటికి చెబితే అందరిని చంపుతానని బెదిరించాడని ఆమె వాపోయింది. చేసిన తప్పు బంధువులకు తెలిసి నిలదీయడంతో క్షమాపణ కోరు తప్పించుకున్నాడని.. రెండోసారి మళ్లీ తప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.  బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి దారుణ ఘటనే రాజస్థాన్ లో ఈ నెల మొదట్లో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునే కీచకపర్వానికి తెరతీశారు. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేసి, హత మార్చడమే కాకుండా.. అనంతరం బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది.

click me!