గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్లో (Republic Day parade) పాల్గొనే వివిధ రాష్ట్రాల శకటాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల శకట నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి కేరళ (kerala) రాష్ట్రం చేరింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్లో (Republic Day parade) పాల్గొనే వివిధ రాష్ట్రాల శకటాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల శకట నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి కేరళ (kerala) రాష్ట్రం చేరింది. కేరళ శకటాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమంది. కేంద్రంతో వున్న విభేదాల కారణంగా రాజకీయ ఎజెండాలో భాగంగానే కేరళ శకటాన్ని తిరస్కరించిందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది సరికాదని.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నమూనాలో లోపాల కారణంగానే తిరస్కరణకు గురైందని అంటున్నారు.
అయితే కలర్, నాణ్యత, దృశ్యమాన ప్రదర్శనలో స్పష్టత, డిజైన్ కాన్సెప్ట్ మొదలైన వాటి ఆధారంగా శకటం ఎంపిక జరుగుతుందని ఏషియానెట్ తెలుసుకుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండవ దశ చివరి వరకు కేరళ రాష్ట్రం షార్ట్లిస్ట్లో వుందని.. అయితే తుది జాబితాలో మాత్రం చేరలేపోయిందని విశ్వసనీయ సమాచారం. రిపబ్లిక్ డే పరేడ్కు కేరళ శకటం స్థానం సంపాదించకపోవడానికి ఐదు రకాల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే..