కరెంట్ కట్... అంధకారంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై

By Arun Kumar PFirst Published Oct 12, 2020, 11:01 AM IST
Highlights

టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగా ముంబై మహానగరం అందకారంగా మారింది. 

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై మహానగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. పవర్ గ్రిడ్ లో ఏర్పడిన సాంకేతిక తప్పిదాల వల్లే నగరానికి పవర్ సప్లయ్ నిలిచిపోయిందని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై  మరియు ట్రాన్స్ పోర్ట్ ఓ ప్రకటన చేసింది. టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. 

పవర్ సప్లై నిలిచిపోవడంతో ముంబైవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కార్పోరేట్ సంస్థలు సహా భారీ, చిన్న పరిశ్రమలతో పాటు సామాన్యులు, వీఐపిలకు ఈ పవర్ కట్ సెగ తాకింది. వెంటనే అధికారులు నగరంలో కరెంట్ సప్లైని పునరుద్దరించాలని ముంబై వాసులు కోరుతున్నారు. 

The electric supply is interrupted due to TATAs incoming electric supply failure.
Inconvenience is regretted.

— BEST Electricity (@myBESTElectric)

 

 

 

click me!