కరెంట్ కట్... అంధకారంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై

Arun Kumar P   | Asianet News
Published : Oct 12, 2020, 11:01 AM ISTUpdated : Oct 12, 2020, 11:23 AM IST
కరెంట్ కట్... అంధకారంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై

సారాంశం

టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగా ముంబై మహానగరం అందకారంగా మారింది. 

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై మహానగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. పవర్ గ్రిడ్ లో ఏర్పడిన సాంకేతిక తప్పిదాల వల్లే నగరానికి పవర్ సప్లయ్ నిలిచిపోయిందని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై  మరియు ట్రాన్స్ పోర్ట్ ఓ ప్రకటన చేసింది. టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. 

పవర్ సప్లై నిలిచిపోవడంతో ముంబైవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కార్పోరేట్ సంస్థలు సహా భారీ, చిన్న పరిశ్రమలతో పాటు సామాన్యులు, వీఐపిలకు ఈ పవర్ కట్ సెగ తాకింది. వెంటనే అధికారులు నగరంలో కరెంట్ సప్లైని పునరుద్దరించాలని ముంబై వాసులు కోరుతున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..