2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిందంటూ సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిందంటూ సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
షుజా చేసిన ప్రకటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. లండన్లో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్కైప్ ద్వారా పాల్గొన్న సయ్యద్ షుజా... 2014లో భారత ఎన్నికల సంఘం వాడిన ఈవీఎంలను అభివృద్ది చేసిన ఈసీఐఎల్ బృందంలో తాను కూడా సభ్యుడినన్నారు.
2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని.. ఈవీఎంలను హ్యాక్ చేసి తమ బృందం రుజువు చేసి చూపించిందంటూ ఆయన ప్రకటించడం భారతదేశ రాజకీయాల్లో దుమారానికి కారణమైంది. వెంటనే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేశాయి.