కేరళ గోల్డ్ స్కీమ్: ఈడీ ఛార్జీషీట్‌లో కీలకాంశాలు

Published : Oct 07, 2020, 05:37 PM IST
కేరళ గోల్డ్ స్కీమ్: ఈడీ ఛార్జీషీట్‌లో కీలకాంశాలు

సారాంశం

గోల్డ్ స్కాంలో ఈడీ బుధవారం నాడు చార్జీషీట్ దాఖలు చేసింది. 

తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కాంలో ఈడీ బుధవారం నాడు చార్జీషీట్ దాఖలు చేసింది. 

తిరువనంతపురంలోని స్పేస్ పార్క్ లో తన అపాయింట్ మెంట్ విషయం సీఎం పినరయి విజయన్ కు తెలుసునని ఆమె చెప్పారు. సీఎం  విజయన్ సమక్షంలో ఐఎఎస్ అధికారి ఎం. శివశంకర్ ను కలిసినట్టుగా ఆమె చెప్పారు. శివశంకర్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా గతంలో పనిచేశాడు.

 కొచ్చిలోని పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఇవాళ ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. శివశంకర్ ను తాను అధికారికంగా 8 దఫాలు కలిసినట్టుగా ఆమె ఈడీ విచారణలో తెలిపింది. అనధికారికంగా చాలాసార్లు ఆయనను కలిసినట్టుగా ఆమె చెప్పారు.

తాను కాన్సుల్ జనరల్ గా ఉన్న విషయం సీఎం విజయన్ కు తెలుసునని ఆమె తెలిపారు. 2019 నవంబర్ స్పేస్ పార్క్ లో చేరింది.స్పేస్ ప్రాజెక్టులోతన నియామకం గురించి సీఎం విజయన్ తో శివశంకర్ మాట్లాడుతానని చెప్పాడని ఆమె వివరించారు.

చార్టెడ్ అకౌంటెంట్  వేణుగోపాల్ తో కలిసి బ్యాంకు లాకర్ ను స్వప్న సురేష్ ప్రారంభించిందని ఈడీ పేర్కొంది. శివశంకర్ సూచనల మేరకే ఈ బ్యాంక్ లాకర్ ను ప్రారంభించారని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!