బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దుబ్బాకకు ఉప ఎన్నికలు

Published : Sep 04, 2020, 03:54 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దుబ్బాకకు ఉప ఎన్నికలు

సారాంశం

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 


న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు.  దేశంలోని 65 స్థానాలకు ఉపఎన్నికలు కూడ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

బీహార్ అసెంబ్లీతో పాటు 65 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను సరైన త్వరలోనే ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.ఈ ఏడాది బీహార్ రాష్ట్రానికి నవంబర్ 29వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్లేదా నవంబర్ మాసంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి కూడ  ఉఫ ఎన్నికలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గత నెలలో మరణించారు. రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన  అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్