బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా తీవ్రత..

Sumanth K | Published : Nov 7, 2023 9:54 AM

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది.  ఈ మేరకు ఎన్‌సీఎస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 

ఇక, నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్‌లో సోమవారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రభావంతో ఢిల్లీలో కూడా ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ) తెలిపింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలు కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలకు లోనయ్యాయని పేర్కొంది.

 

click me!