ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదు

Published : Oct 15, 2023, 11:58 PM IST
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదు

సారాంశం

Earthquake: దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. హర్యానాలోని ఫరీదాబాద్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని సంబంధిత అధికారులు తెలిపారు.  

Earthquake: దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. హర్యానాలోని ఫరీదాబాద్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని సంబంధిత అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్త‌ర భార‌తంలో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రకంపనల ప్ర‌భావం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో క‌నిపించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

అయితే, పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలను అనుభవించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. దేశంలో సంభవించిన వరుస భూకంపాలలో ఇది అత్యంత బలమైనదిగా పేర్కొంటున్నారు. 

ఇదిలావుండ‌గా, ఆఫ్ఘనిస్తాన్‌లో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. ప్రాంతీయ‌ రాజధాని హెరాత్‌కు వెలుపల 34 కిలోమీటర్ల దూరంలో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలమైన భూకంపాలు, ప్రకంపనలు వేలాది మందిని చంపి, దేశంలోని మొత్తం గ్రామాలను అత‌లాకుత‌లం చేసిన వారం రోజుల తర్వాత మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu