SpiceJet: "ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. స్పైస్‌జెట్ సేవ‌ల‌ను నిలిపివేయండి" .. పిల్ తిరస్క‌ర‌ణ‌ 

Published : Jul 18, 2022, 04:39 PM IST
SpiceJet: "ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. స్పైస్‌జెట్ సేవ‌ల‌ను నిలిపివేయండి" .. పిల్ తిరస్క‌ర‌ణ‌ 

సారాంశం

SpiceJet  Flights Issue: సాంకేతిక లోపాల కారణంగా భారతదేశంలో స్పైస్‌జెట్ సేవలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. గత 30 రోజుల్లో దాని విమానాలలో కనీసం తొమ్మిది సాంకేతిక లోపం సంఘటనలు నివేదించబడ్డాయి.

SpiceJet  Flights Issue: ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ స‌మ‌స్య‌ల‌కు కేరాఫ్ గా మారింది. ఈ సంస్థ‌కు చెందిన విమానాలు ప‌లు మార్లు సాంకేతిక లోపాల‌తో అత్యవ‌స‌రంగా ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ సమ‌స్య‌పై విచార‌ణ జ‌రుగుతున్న‌..  ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. ఇప్పుడు దాని ఆపరేషన్‌కు సంబంధించి కోర్టులో పిల్  దాఖలు చేయబడింది. స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ లోపాలు తలెత్త‌డంతో.. భారతదేశంలో స్పైస్‌జెట్ సేవలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
ఈ పిటిషన్‌పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ .. ఈ అంశం ప్రభుత్వానికి సంబంధించినదని, ఇందులో హైకోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది. ఇలాంటి సంఘటనలన్నింటిని పరిశీలించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సరైన సంస్థ అని కూడా పేర్కొంది .ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో చేసిన ఆరోపణల ఆధారంగా విమానయాన సంస్థ కార్యకలాపాలను కోర్టు ఆపలేమని తెలిపింది.

వివారాల్లోకెళ్తే.. స్పైస్‌జెట్ విమానాల విమానాలను నిలిపివేయాలని న్యాయవాది రాహుల్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)  దాఖలు చేశారు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ విమానాల్లో ఇటీవలి అంతరాయాల సంఘటనలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. సోమవారం నాటి విచారణలో, స్పైస్‌జెట్ విమానాల లోపాల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భరద్వాజ్ సమర్పించారు. ఎయిర్‌లైన్స్‌లో సరైన నిర్వహణ లేదని ఆయన ఆరోపించారు.
 
న్యాయవాది రాహుల్ భరద్వాజ్ దాఖలు చేసిన పిల్‌లో స్పైస్‌జెట్ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయో? లేదో? అనే విష‌యాన్నితనిఖీ చేయడానికి  విచారణ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌పై క్రిమినల్‌ విచారణ కూడా జరుగుతోందని పిల్‌లో పేర్కొన్నారు.

గత రెండున్నర నెలల్లో 16 విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సమాచారం. వీటిలో చాలా విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. చాలా వరకు ల్యాండింగ్ తర్వాత టేకాఫ్ కాలేదు. ఈ సమస్యలు చాలా వరకు స్పైస్‌జెట్ విమానాల్లో నమోదయ్యాయి.

ఈ త‌రుణంలో జూలై 6న, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్..స్పైస్‌జెట్ సంస్థకు..  భద్రత గురించి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నోటీసులో పౌర విమానయాన అథారిటీ ఏప్రిల్ 1 నుండి అనేక స్పైస్‌జెట్ విమానాలు తమ ప్రారంభ విమానాశ్రయానికి తిరిగి రావాలని పేర్కొంది.


స్పైస్‌జెట్ విమానాల్లో లోపాలు

>> జూలై 12న దుబాయ్-మధురై స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ ఆలస్యమైంది, విమానం ఇంజ‌న్లో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో ఆలస్యమైంది.

>> జూలై 6న, చైనాలోని చాంగ్‌కింగ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ ఫ్రైటర్ విమానం టేకాఫ్ తర్వాత కోల్‌కతాకు తిరిగి వచ్చింది. విమానంలోని వాతావరణ రాడార్ పనిచేయకపోవడాన్ని పైలట్లు గుర్తించారు.

>> జూలై 5న.. ఢిల్లీ నుంచి దుబాయ్ స్పైస్‌జెట్ విమానంలో ఇంధన సూచిక సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు.

>> అదే రోజు..  గుజరాత్‌లోని కాండ్లా నుండి ముంబైకి వెళ్తున్న‌  మరో స్పైస్‌జెట్ విమానం విమానం విండ్‌షీల్డ్ బయటి పేన్ పగిలిపోవడంతో మహారాష్ట్ర రాజధానిలో ల్యాండింగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

>> జూలై 2న, ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్‌జెట్ విమానం 5,000 అడుగుల ఎత్తులో క్యాబిన్‌లో పొగలు కమ్ముకోవడంతో  తిరిగి ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు.

>> జూన్ 19న, పాట్నా-ఢిల్లీ విమానానికి పక్షి ఢీకొనడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అది పాట్నాకు తిరిగి వచ్చింది.

>> జూన్ 24, జూన్ 25 తేదీలలో టేకాఫ్ అవుతున్నప్పుడు రెండు వేర్వేరు స్పైస్‌జెట్ విమానాలపై ఫ్యూజ్‌లేజ్ డోర్ హెచ్చరికలు వెలిగించాయి.  

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?