ఢిల్లీని ముంచెత్తిన య‌మునా వ‌ర‌ద నీరు.. రంగంలోకి ఇండియ‌న్ ఆర్మీ

Published : Jul 14, 2023, 02:02 PM IST
ఢిల్లీని ముంచెత్తిన య‌మునా వ‌ర‌ద నీరు.. రంగంలోకి ఇండియ‌న్ ఆర్మీ

సారాంశం

New Delhi: యమునా నీటిమట్టం శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు 208.48 మీటర్లకు చేరుకుందని కేంద్ర జల సంఘం తెలిపింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్ జోన్ లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహద్రాలోని 7 పాఠశాలలను వరద వంటి పరిస్థితుల కారణంగా ఈ రోజు మూసివేయనున్నట్లు ఎంసీడీ తెలిపింది. భారీ వర్షాలు, హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  

Delhi floods: యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో డ్రెయిన్ రెగ్యులేటర్ తెగిపోవడంతో దేశ రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలి అయిన ఢిల్లీలోని ఐటీఓ క్రాసింగ్ ప్రాంతం జలమయమైంది. ఈ ప్రాంతంలో వరదలకు ఇదే కారణమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ లో పేర్కొన్నారు. వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను అత్యవసరంగా పరిష్కరించడానికి సైన్యం, విపత్తు సహాయక దళం సహాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ విప‌త్తు కార‌ణంగా ఐటీవో, పరిసరాలు జలమయం అవుతున్నాయి. ఇంజనీర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఆర్మీ/ ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించిన‌ట్టు తెలిపారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలను కలిపే ఘటనా స్థలాన్ని సందర్శించిన కేజ్రీవాల్, తమ ప్రభుత్వం గతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరినందున జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం గురువారం రాత్రే సంఘటనా స్థలంలో ఉండి ఉంటే ఈ పరిస్థితిని నివారించేవారని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యాన్ని రంగంలోకి దించామని ఆయన పునరుద్ఘాటించారు.

ఓల్డ్ రైల్వే బ్రిడ్జి (ఓఆర్ బీ) వద్ద యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటి 208.40 మీటర్ల వద్ద ఉంది. హర్యానాలోని యమునా నగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుండి వారం పొడవునా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య నీటిని విడుదల చేయడం వల్ల యమునా నది వ‌ర‌ద నీరు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ప్రవహించింది.

 

యమునా నీటిమట్టం శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు 208.48 మీటర్లకు చేరుకుందని కేంద్ర జల సంఘం తెలిపింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్ జోన్ లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహద్రాలోని 7 పాఠశాలలను వరద వంటి పరిస్థితుల కారణంగా ఈ రోజు మూసివేయనున్నట్లు ఎంసీడీ తెలిపింది. భారీ వర్షాలు, హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
Abhinandan Varthaman: పాక్ ఎఫ్‌16ను కూల్చిన హీరో అభినందన్ వర్ధమాన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎందుకు చేరారు?