Cyclone Biparjoy: మేకలను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి..

Published : Jun 16, 2023, 09:25 AM IST
 Cyclone Biparjoy: మేకలను కాపాడే  ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి..

సారాంశం

బిపర్‌జోయ్ తుపాన్ పశ్చిమ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బిపర్‌జోయ్ తుపాన్ పశ్చిమ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో వరదల కారణంగా లోయలో చిక్కుకున్న తమ మేకలను రక్షించేందుకు యత్నించిన తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నిపించింది. మృతులను రామ్‌జీ పర్మార్, అతడి కుమారుడు రాకేష్ పర్మార్‌గా గుర్తించారు. మేకలు కూడా లోయలో కొట్టుకుపోయి మృతిచెందాయి.

గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సిహోర్ పట్టణానికి సమీపంలోని భండార్ గ్రామం గుండా వెళుతున్న లోయలో నీరు ప్రవహించడం ప్రారంభమైందని మమ్లత్దార్ (రెవెన్యూ అధికారి) ఎస్ఎన్ వాలా తెలిపారు. ‘‘అకస్మాత్తుగా నీరు రావడంతో మేకల మంద లోయలో చిక్కుకుంది. జంతువులను రక్షించడానికి 55 ఏళ్ల రామ్‌జీ పర్మార్, అతని కుమారుడు రాకేష్ పర్మార్ (22) లోయలోకి ప్రవేశించారు. అయితే అవి లోయలో కొట్టుకుపోయాయి. వాటి మృతదేహాలు కొంత దూరం నుండి బయటపడ్డాయి. మేకలను రక్షించే క్రమంలో రామ్‌జీ, రాకేష్ ప్రాణాలు కోల్పోయారు’’ అని చెప్పారు. ఈ ఘటనలో 22 మేకలు, ఒక గొర్రె కూడా మరణించాయి.

ఇక, బిపర్‌జోయ్ తుపాను కచ్ జిల్లాలో తీరం దాటింది. భావ్‌నగర్‌తో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో తుపాను సంబంధిత మరణాలు ఏవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. తుపాన్‌తో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతమైన కచ్ జిల్లాలో మరణాల నివేదికలేమీ లేవని కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు. ‘‘మేము ముందస్తుగా సామూహిక తరలింపుకు ధన్యవాదాలు చెబుతున్నాం. తుపాన్‌తో ముడిపడి ఉన్న ఏ సంఘటన కారణంగా కచ్‌లో ఇప్పటివరకు ఎవరూ మరణించలేదు. గంటకు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా కొన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి’’ అని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?