వీధుల్లో భారీ మొసలి సంచారం.. భయంతో పరుగులు తీసిన జనం.. 

Published : Oct 11, 2023, 04:11 AM IST
వీధుల్లో భారీ మొసలి సంచారం.. భయంతో పరుగులు తీసిన జనం.. 

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌ జిల్లాలో ఓ భారీ మొసలి సంచారం కలకలం రేపింది.  భాగీరథి నది నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.  పోలీసులు, అటవీ శాఖ  సత్వరమే స్పందించి ఆ మొసలిని పట్టుకుని ప్రజలను రక్షించారు

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కల్నాలో భారీ మొసలి వీధుల్లో సంచరించడం కలకలం రేపింది. రెండు వారాల క్రితమే కల్నాలోని ఫెర్రీ ఘాట్ వద్ద ఈ మొసలి కనిపించినట్టు సమాచారం. జనావాసాల ప్రాంతంలో మొసలి కనిపించడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.కల్నా వీధుల్లో భారీ మొసలి కనిపించిందని పోలీసులు, అటవీ శాఖ సమాచారం అందడంతో సత్వరమే స్పందించి మొసలిని పట్టుకుని ప్రజలను రక్షించారు

ఈ భారీ మొసలి భాగీరథి నది నుంచి బయటకు వచ్చిందని, మొదట జనసంచారం ఉన్న ప్రాంతంలో కనిపించిందని స్థానిక పోలీసులు తెలిపారు. దీని తరువాత అది నివాస ప్రాంతాలకు వెళ్లి కల్నా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 10 పాల్పర వాసులను భయాందోళనలకు గురి చేసింది.

సమాచారం అందుకున్న వెంటనే కల్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వల వేసి మొసలిని పట్టుకున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండడంతో మొసలి ఎవరికీ హాని తలపెట్టలేదు. ఉదయం నుంచి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది అక్కడే ఉన్నారు.

మొసలిని రక్షించి అటవీ శాఖలోని కత్వా విభాగానికి తరలించినట్లు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిషా గోస్వామి తెలిపారు. భౌతిక పరీక్షల అనంతరం భాగీరథి నదిలో సహాయక వాతావరణంలో మొసలిని వదులుతామని గోస్వామి తెలిపారు. 

రాత్రి 2:30 గంటల ప్రాంతంలో కల్నా మున్సిపాలిటీ పరిధిలో మొసలి కనిపించినట్లు సమాచారం అందింది. పోలీసులతో పాటు రేంజ్ అధికారి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం మొసలిని కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు సురక్షితంగా నదీ తీరాలకు వెళ్లేందుకు వీలుగా ఘాట్లపై అటవీశాఖ అప్రమత్తంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

నెల రోజుల్లో రెండో ఘటన

కల్నాలోని భాగీరథి నది నుంచి మొసలి రావడం ఇదే తొలిసారి కాదు. రెండు వారాల క్రితం అగ్రద్వీప్‌లోని కాళికాపూర్‌లోని ఫెర్రీ ఘాట్ వద్ద మొసలి కనిపించింది. గ్రామస్థుల సహకారంతో సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించిన అటవీశాఖ ఎట్టకేలకు మొసలిని పట్టుకున్నారు.  

నదిలో నుంచి మొసళ్లు బయటకు వస్తున్న ఘటనలపై జిల్లా అటవీ అధికారి నిషా గోస్వామి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగడానికి చాలా కారణాలు ఉండవచ్చని అన్నారు. ఆహార కొరత, ఆవాసాల నాశనం మొదలైనవి. ఇటీవల ఈ ప్రాంతంలో వరదలు కూడా ఎదుర్కొన్నాం. నది ఎగువ ప్రాంతంలో మొసళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇతర కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు