దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకూ స్మశానవాటిక

Arun Kumar P   | Asianet News
Published : Oct 08, 2020, 07:38 AM ISTUpdated : Oct 08, 2020, 07:57 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకూ స్మశానవాటిక

సారాంశం

 దేశ రాజధాని డిల్లీలోని పిటోర్నిలో పెంపుకు కుక్కలను దహనం చేసేందుకు ప్రత్యేక స్మశానవాటికను ఏర్పాటుచేశారు.

న్యూడిల్లీ: ఎంతో ప్రేమగా తమ కుటుంబసభ్యుల మాదిరిగా చూసుకున్న పెంపుడుకుక్కలు చనిపోతే వాటిని ఎక్కడ వేయాలో కూడా తెలియని పరిస్ధితి. మున్సిపల్ సిబ్బందికి కూడా వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ సమస్య లేకుండా డిల్లీ జంతు ప్రేమికులకు ఓ స్వచ్చంద సంస్థ ఓ శుభవార్త అందించింది. 

దేశ రాజధాన్ని డిల్లీలోని పిటోర్నిలో పెంపుకు కుక్కలను దహనం చేసేందుకు ప్రత్యేక స్మశానవాటికను ఏర్పాటుచేశారు.  ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో డిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఈ ఏర్పాటు చేసింది. బుధవారం డిల్లీ మేయర్ అనామికా ఈ జాగిలాల శ్మశానవాటికను ప్రారంభించారు. 

ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాగిలాలు చనిపోయి బాధలో వున్నవారికి స్వాంతన  కలిగించేలా పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్న ఈ శ్మశానవాటికలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దాదాపు గంట వరకు తమ పెంపుడు కుక్కులను గౌరవప్రదంగా దహనం చేసకోవచ్చని డిల్లీ మేయర్ వెల్లడించారు. 

ఇక వీధికుక్కల కోసం కూడా ఓ రెస్క్యూ అంబులెన్స్ ను కూడా మేయర్ ప్రారంభించారు.  గాయపడి, అనారోగ్యంతో వున్న వీధి కుక్కలకు చికిత్స అందించడానికి వీలుగా ఈ అంబులెన్స్ ను సిద్దం చేసినట్లు...గాయాలు తగ్గిన తర్వాత శునకాలను తిరిగి వదిలిపెడతారని మేయర్ అనామిక తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !