Covid News:  కోవిడ్ హెచ్చరిక! చెన్నైలో మాస్క్‌ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..

Published : Jul 06, 2022, 04:12 AM ISTUpdated : Jul 06, 2022, 04:15 AM IST
Covid News:  కోవిడ్ హెచ్చరిక! చెన్నైలో మాస్క్‌ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..

సారాంశం

Covid News:   త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల క్ర‌మంగా పెరుగుతున్నాయి. క్ర‌మంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అప్ర‌మత‌మైంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధించ‌నున్న‌ట్టు కార్పొరేషన్ తెలిపింది

Covid News:  త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల క్ర‌మంగా పెరుగుతున్నాయి. క్ర‌మంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అప్ర‌మత‌మైంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధించ‌నున్న‌ట్టు కార్పొరేషన్ తెలిపిందిదేశంలో క‌రోనా ఫోర్త్ వేవ్  ఎగసిపడుతుందన్న భయంతో తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి మాస్క్‌లు తప్పనిసరి చేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ యాక్టివ్‌గా మారింది. చెన్నైలో ఇప్పుడు మాస్కులు ధరించని వారికి రూ.500 జరిమానా విధిస్తారు. మండల స్థాయిలో బృందంగా ఏర్పడి జరిమానాలు విధిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
 
పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, కరోనా ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు సంబంధించి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మరోసారి మాస్క్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరి

ఈ స‌మావేశం ప్ర‌కారం.. మొదటి దశలో జనాలు గుమిగూడే ప్రదేశాలలో ఫేస్ మాస్క్ త‌ప్పని స‌రి చేసింది.  
మాస్క్‌లు వేయకపోతే రూ.500 జరిమానా విధించబడుతుంది. వీటిలో అన్ని పబ్లిక్ స్థలాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు , మతపరమైన స్థలాలు ఉన్నాయి. తమిళనాడులో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఆదివారం 2,672 కేసులు నమోదయ్యాయి. ఆదివారం చెన్నైలో 1,072, చెంగల్‌పేటలో 373, కోయంబత్తూరులో 145, తిరువలూరులో 131, తిరుచిరాపల్లిలో 104 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఒక్క రోజులో 13 వేలకు పైగా కేసులు

భారతదేశంలో ఒక్క రోజులో 13,086 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో సోకిన వారి సంఖ్య 4,35,31,650కి పెరిగింది. అదే సమయంలో, చికిత్సలో ఉన్న రోగుల సంఖ్య 1,14,475 కు చేరింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, సంక్రమణతో మరో 19 మంది మరణించిన తరువాత భారతదేశంలో మరణాల సంఖ్య 5,25,242 కు పెరిగింది.

90 శాతం వయోజన జనాభా వ్యాక్సినేష‌న్ 
 
భారతదేశంలోని వయోజన జనాభాలో తొంభై శాతం మందికి కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేయబడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు, సోమవారం దేశంలో మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 198 కోట్లు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు 10 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. ఇప్పటివరకు, 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారికి 6,057,990 ముందస్తు జాగ్రత్త మోతాదుల COVID-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu