లంచం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ.. ఇబ్బందులో శశికళ, ఇళవరసి

Published : Sep 05, 2023, 12:53 PM IST
లంచం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ.. ఇబ్బందులో శశికళ, ఇళవరసి

సారాంశం

Bengaluru: జైలు నిబంధనలను ఉల్లంఘించి శశికళ, రాజకుమారి ఇద్దరూ విలాసవంతమైన సౌకర్యాలు పొందారనీ, జైలు నుంచి బయటకు వెళ్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టగా.. లగ్జరీ సౌకర్యాల కోసం జైలు అధికారులకు రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు మేరకు కర్ణాటక ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.  

Bribery Case: క‌ర్నాట‌క‌లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్నప్పుడు విలాసవంతమైన సౌకర్యాల పొంద‌డం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసులో శశికళ, ఇళవరసిలపై కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజ‌రుకాక‌పోవ‌డంతో వారిని అరెస్టు చేసి అక్టోబర్ 5న కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో క‌ర్నాట‌క మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువులు సుధాకరన్, ఇళవరసిలకు క‌ర్నాట‌క‌లోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ నలుగురిని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. అయితే, ప‌లు విచార‌ణ త‌ర్వాత ఈ కేసులో కర్ణాటక హైకోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు మిగిలిన ముగ్గురు (శశికళ, ఇళవరసి, సుధాకరన్) పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు.

అయితే, జైలు నిబంధనలను ఉల్లంఘించి శశికళ, ఇళవరసి ఇద్దరూ విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి జైలు నుంచి బయటకు వస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో జైలు అధికారులకు లగ్జరీ సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదు మేరకు క‌ర్నాట‌క ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీంతో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర లోకాయుక్త కోర్టులో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బెంగళూరులోని లోకాయుక్త కోర్టులో ఈ కేసు నిన్న విచారణకు వచ్చింది. శశికళ ఇళవరసి తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి శశికళ, ఇళవరసిలపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu