uttarakhand election result 2022: ఉత్త‌రాఖండ్‌లో 48 సీట్ల మెజారిటీతో గెలుస్తాం: మాజీ సీఎం హ‌రీశ్ రావ‌త్

Published : Mar 10, 2022, 09:26 AM IST
uttarakhand election result 2022: ఉత్త‌రాఖండ్‌లో 48 సీట్ల మెజారిటీతో గెలుస్తాం: మాజీ సీఎం హ‌రీశ్ రావ‌త్

సారాంశం

uttarakhand election result 2022: ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో తాము 48 సీట్లు గెలుచుకుంటామ‌ని రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హ‌రీశ్ రావ‌త్ అన్నారు.

uttarakhand election result 2022: ఉత్తరాఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాపు 48 సీట్లు గెలుచుకోవచ్చని అన్నారు. "ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయంపై నాకు నమ్మకం ఉంది. వచ్చే 2-3 గంటల్లో అంతా తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలపై నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ 48 స్థానాలకు చేరువవుతుందని నేను నమ్ముతున్నాను" అని రావత్ అన్నారు.

ఉత్తరాఖండ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు మరియు AAP, SP, BSP మరియు UKD వంటి  పార్టీలు కీల‌క పాత్ర పోషించే అవకాశాన్ని పెంచుతుంది. 60 స్థానాలకు గాను 40 నుంచి 45 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నేరుగా పోటీ పడుతుండగా, ప్రాంతీయ పార్టీలు 25-30 స్థానాల్లో త్రిముఖ పోరు సాగించాయి. అధికార బీజేపీ కూడా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దాని కంటే పార్టీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు."చాలా ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే మా వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరియు ఆ పార్టీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. చేసిన పనికి ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంది’’ అని అన్నారు. కాగా ఒప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల కౌంటింగ్ ఫ‌లితాలు గ‌మనిస్తే.. బీజేపీ 32, కాంగ్రెస్ 30 స్థానంల్లో ముందంజ‌లో ఉన్నాయి. 

 

 

కాగా, ఉత్తరాఖండ్‌ లో  ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగ్గా.. 65.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన  632 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

బీజేపీ తరపు నుంచి మంత్రులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఉత్తరాఖండ్ యూనిట్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu