కోవిడ్ -19 : కొత్తగా 51,667 కేసులు, తగ్గుతున్న క్రియాశీల కేసుల సంఖ్య..

By AN TeluguFirst Published Jun 25, 2021, 11:07 AM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17.35,781 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 51,667 మందికి పాజిటివ్ గా తేలింది. తాజాగా 1,329మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,34,445 కి చేరగా.. 3,93,310మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17.35,781 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 51,667 మందికి పాజిటివ్ గా తేలింది. తాజాగా 1,329మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,34,445 కి చేరగా.. 3,93,310మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక నిన్న 64,527మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,91,28,267కి చేరాయి. రికవరీ రేటు 96.66 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 2.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 6 లక్షలకు పడిపోయాయి. 

మరోపక్క సోమవారం నుంచి కరోనా టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 60,73,301 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 30,79,48,744 కి చేరింది. 

click me!