Congress: కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు.. మల్లికార్జున ఖ‌ర్గే నామినేష‌న్ దాఖ‌లు

Published : Sep 30, 2022, 03:55 PM IST
Congress: కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు.. మల్లికార్జున ఖ‌ర్గే నామినేష‌న్ దాఖ‌లు

సారాంశం

Mallikarjun Kharge: మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వానికి తాను, ఆ పార్టీ సహచరుడు ఆనంద్ శర్మ మద్దతిస్తామని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ శుక్రవారం తెలిపారు. తాజాగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.   

Congress president election: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. "నేను నా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను (కాంగ్రెస్ అధ్యక్ష పదవికి)" అని ఖర్గే పార్టీ కార్యాలయం వైపు వెళుతున్నప్పుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. 

కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ ఎస్ హుడా మాట్లాడుతూ... “కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను మరియు అతను ఎన్నిక అవుతాడనే నమ్మకం ఉంది. కొన్నేళ్లుగా ఆయన పార్లమెంటులో ప్రజల గొంతుకను పెంచారు. నేను అతని నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకుడిగా సంతకం చేసాను అని అన్నారు. 

 

అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠిలు సైతం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, థరూర్ ఈ రోజు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్ ఘాట్‌ను సందర్శించారు.

అలాగే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి కూడా పార్టీ అత్యున్నత స్థానానికి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీ నాయకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. “నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్ శాసనసభ ఉపనేతగా ఎన్నికైన ఓ రైతు కుమారుడు కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని దేశం చూస్తోందని త్రిపాఠి చెప్పారు. అంతకుముందు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రేసులో ఉన్నారు. కానీ చివ‌ర‌కు అధ్య‌క్ష ప‌ద‌వి రేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఖర్గేను ఆయన నివాసంలో పరామర్శించారు. "నేను అతనికి అండగా ఉంటాననీ, ఆయ‌న‌పై పోటీ చేయడం గురించి ఆలోచించలేనని, నేను అతని ప్రతిపాదకుడిగా ఉంటానని కూడా ఖ‌ర్గేకు చెప్పాను" అని దిగ్విజయ్ సింగ్ విలేకరులతో అన్నారు.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu