చ‌లి గాలులు, ద‌ట్టమైన పొగమంచు.. దేశంలో మ‌రో మూడు రోజులు ఇదే వాతావ‌ర‌ణం: ఐఎండీ

Published : Jan 16, 2023, 10:18 AM IST
చ‌లి గాలులు, ద‌ట్టమైన పొగమంచు.. దేశంలో మ‌రో మూడు రోజులు ఇదే వాతావ‌ర‌ణం: ఐఎండీ

సారాంశం

New Delhi: ఇప్ప‌టికే ఉత్తర భారతంలో ద‌ట్ట‌మైన పొగ‌మంచు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌రో మూడు రోజుల పాటు ఇదే వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. అలాగే, హిమాచల్, పంజాబ్ ల‌లో మంచు కూరుస్తుంద‌ని తెలిపింది. "ఉత్తర భారతంలో మంచు గాలులు వీస్తుండటంతో మూడు రోజుల పాటు చలిగాలులు వీస్తాయి.. ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి" అని వాతావరణ శాఖ తెలిపింది.  

Intense cold wave, dense fog:  దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాల ప‌రిస్థితుల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పెరుగుతున్న చ‌లి, ద‌ట్ట‌మైన పొగ‌మంచు, త‌గ్గుతున్న ఉష్ణోగ్ర‌త‌లు మరికొన్ని రోజులు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే ఉత్తర భారతంలో ద‌ట్ట‌మైన పొగ‌మంచు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌రో మూడు రోజుల పాటు ఇదే వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. అలాగే, హిమాచల్, పంజాబ్ ల‌లో మంచు కూరుస్తుంద‌ని తెలిపింది. "ఉత్తర భారతంలో మంచు గాలులు వీస్తుండటంతో మూడు రోజుల పాటు చలిగాలులు వీస్తాయి.. ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి" అని వాతావరణ శాఖ తెలిపింది.

 

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచు గాలులు కొనసాగుతుండగా, మూడు రోజుల తీవ్రమైన చలి గాలులు వీస్తాయ‌నీ, ఇవి ఉష్ణోగ్రతలను మరో రెండు డిగ్రీలు తగ్గిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయినప్పటికీ, గురువారం నుంచి పాశ్చాత్య అలజడులు కొంత ఉపశమనం కలిగించే వరకు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం.. పాఠశాలలు మూసివేత

ద‌ట్ట‌మైన పొగ‌మంచు, చ‌లి తీవ్ర‌త వంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. అలాగే, చ‌లి దృష్టిలో ఉంచుకుని ప‌లు ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌గా, మ‌రికొన్ని చోట్ల గ‌ర‌గ‌తుల స‌మ‌యాల‌ను మార్చారు. పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే సోమవారం తెలిపింది.

 

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ.. "నా రైలు ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేయబడింది, కానీ ఇది 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. చలికాలంలో ప్ర‌యాణం మ‌రింత‌గా కష్టంగా ఉంది" అని తెలిపారు. తీవ్రమైన చలిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లా యంత్రాంగం జనవరి 17 వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది, మీరట్ లోని జిల్లా యంత్రాంగం అదే ఉత్తర్వులను జారీ చేసింది. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు