జాతీయ విద్యా విధానం-2020లో మార్పులు అవసరం: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా

Published : Sep 10, 2022, 03:08 PM IST
జాతీయ విద్యా విధానం-2020లో మార్పులు అవసరం: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా

సారాంశం

National Education Policy-20202: జాతీయ విద్యా విధానం-2020లో భారీ అంత‌రాలు ఉన్నాయ‌నీ, దానిని వెంట‌నే అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌నీ ఆమ్ ఆద్మీ (ఆప్‌) నాయ‌కుడు, ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా అన్నారు.   

Delhi Deputy Chief Minister Manish Sisodia: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020లో మార్పులు అవసరమని ఆమ్ ఆద్మీ (ఆప్) నాయ‌కుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం అన్నారు. జాతీయ విద్యా విధానం-2020లో భారీ అంత‌రాలు ఉన్నాయ‌నీ, దానిని వెంట‌నే అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌ని కూడా పేర్కొన్నారు. శ‌నివారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ టీచర్స్ యూనివర్శిటీ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిసోడియా ప్రసంగిస్తూ.. విద్యా సంబంధిత విధానాలను 360-డిగ్రీల వీక్షణను అందించాలని అన్నారు. ఉపాధ్యాయ శిక్షణతో సహా అన్ని అంశాలను అందులో చేర్చాలని పేర్కొన్నారు. 

"NEP 2020లో మార్పులు అవసరం. ఈ విధానంలో కొన్ని అంశాల‌ను జోడించాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టిలో కూడా విద్యకు సంబంధించిన విధానాలు 360 డిగ్రీల వీక్షణను అందించడంతోపాటు ఉపాధ్యాయుల శిక్షణతో సహా అన్ని అంశాలను అందులో పొందుపరచాలని ఆయన అన్నారు" అని మ‌నీష్ సిసోడియా వెల్ల‌డించారు.  నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2020 గురించి చర్చించడానికి “కనెక్టింగ్ ది డాట్స్” కార్యక్రమం జరిగింది. NEP 2020లో భారీ అంతరాలు ఉన్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న, దానిని వెంటనే అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. 

“ఢిల్లీలో NEPని అమలు చేయాలని మేము నిర్ణయించుకుంటే, 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఎవరు బోధిస్తారు? ఆ ఉపాధ్యాయుల అర్హత ఏమిటి? దాని గురించి ఇంకా ఏమీ చర్చించలేదు. పాలసీలో చాలా గ్యాప్ ఉంది'' అని తెలిపారు. ఢిల్లీలోని ఉపాధ్యాయులకు బాగా శిక్షణ పొందేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని సిసోడియా తెలిపారు. "మా ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణా విశ్వవిద్యాలయంలో ఒక భాగం. ఉపాధ్యాయులకు సుశిక్షితులైన వారికి అన్ని సౌకర్యాలను మేము అందించాము. ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉంది.. కానీ దురదృష్టవశాత్తు సమాజంలో ప్రోత్సాహం లేదు’’ అని మనీష్ సిసోడియా అన్నారు. ఒక విధానాన్ని రూపొందించడంలో, దానిని అమలు చేయడంలో చాలా వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. 

జాతీయ విద్యా విధానంపై ఇప్ప‌టికే అనేక అంత‌రాలు ఉన్నాయ‌ని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో అనేక అంశాలను వ‌దిలేసింద‌ని పేర్కొన్నాయి. దాని అమ‌లును వ్య‌తిరేకిస్తున్నాయి. కాగా, జులై 2020లో కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానం (NEP)కి ఆమోదం తెలిపింది. ఇది ప్రీ-స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వత్రికీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. NEP-2020, ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్-1986 స్థానంలో ఉంటుంది. ఇది దేశంలోని ప్రాథమిక స్థాయి విద్య నుండి ఉన్నత విద్య వరకు దృష్టి సారించే సమగ్ర ఫ్రేమ్‌వర్క్. ఏదైనా విద్యా వ్యవస్థ లక్ష్యం పిల్లలకు ప్రయోజనం చేకూర్చడమే, తద్వారా పుట్టిన లేదా నేపథ్యం కారణంగా ఏ పిల్లవాడు నేర్చుకునే-రాణించే అవకాశాన్ని కోల్పోరు.. NEP-20202 పాఠశాల విద్యలో 2030 నాటికి 100% స్థూల నమోదు నిష్పత్తి (GEER) లక్ష్యంగా పెట్టుకుంది.

PREV
click me!

Recommended Stories

Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu