కరోనా వేళ పేదలకు చిప్స్ ప్యాకెట్లు పంచిన మంత్రి కిషన్ రెడ్డి

By team teluguFirst Published May 24, 2021, 10:04 AM IST
Highlights

ఢిల్లీలో హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి చిప్స్ ప్యాకెట్లను పేదలకు ఆహారంగా అందించారు

కరోనా సమయంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు లాక్ డౌన్ కూడా విధించడంతో సామాన్యులు, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు తిండి కోసం కూడా అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, వాలంటీర్స్ కొందరు ముందుకు వచ్చి పేదలకు ఆహారాన్ని అందిస్తూ ఈ కష్టకాలంలో ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. 

आज गृह राज्य मंत्री जी द्वारा को खाद्य सामग्री दी गई।

यह सामग्री के अंतर्गत दिल्ली भर में भाजपा द्वारा चलाए जा रहे कैंप में जरूरतमंदों के साथ-साथ दिल्ली की सेवा में कार्यरत निगम कर्मचारियों व पुलिस कर्मियों के बीच वितरित की जाएँगी। pic.twitter.com/0U1R11aXgP

— Adesh Gupta (@adeshguptabjp)

తాజాగా కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఢిల్లీలో ఆహారాన్ని అందించే సేవా హీ సంఘటన్ కి ఆహరం అందజేయబడింది. ఆహరం అందించడం మంచి పని. కానీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా... ఆయన అందించింది చిప్స్, డోరిటోస్ ప్యాకెట్లు. దానితో సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. 

ग़रीब बच्चे चिप्स नहीं खा सकते ? एक Corp ने CSR के तहत ग़रीबों में बाटने के दिए थे जिसे अध्यक्ष जी ने बँटवाया। चिप्स सिर्फ़ अमीर लोग खाएँगे, ग़रीब खा ले तो तकलीफ़ है ? और रही बात राशन की तो अध्यक्ष जी के नेतृत्व में रोज़ हज़ारों पैकेट सूखा और पका राशन दिल्ली में बाँटा जा रहा है।

— Punit Agarwal (@Punitspeaks)

ఇలాంటి కరోనా కాలంలో పౌష్టికాహారం అందించాలి కానీ ఇలాంటి ఆహార పదార్థాలను అందించడం అవసరమా అని నెటిజెన్ల ప్రశ్నిస్తున్నారు. ఈ ఫోటోలను స్వయంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ట్వీట్ చేసారు. దీనితో దీని పై నెటిజెన్ల విరుచుకుపడుతుంటే... మరికొందరేమో పేదలు చిప్స్ తినకూడదా అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యారు.

Who give doritos in pandemic days?

If you willing to give something than you can buy the rice and dal with that amount and this is like you gifting snacks for midnight party, sorry to say !

— Desi Caffeine (@DesiCaffeine)

మొత్తంగా చేతుల మీదుగా అందించినందుకు కిషన్ రెడ్డి ని సైతం ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఇక కొందరైతే మేక్ ఇన్ ఇండియాను పక్కకు పెట్టి విదేశీ చిప్స్ ప్యాకెట్లు ఇవ్వడమేంటి లిజ్జత్ పాపడ్స్ ఇస్తే బాగుండేది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

कुछ ऐसा देना चाहिए था ना जो पौष्टिक हो, इम्यूनिटी बढ़ाने में योगदान दे। ये क्या है? कुरकुरे, टकाटक, डोरिटोज? इसको खाद्य सामग्री नहीं, चखना कहते हैं। खैर, ये सब काम करने हैं तो करें लेकिन कम से कम मोदीजी को तो टैग मत कीजिए।

— THE SKIN DOCTOR (@theskindoctor13)
click me!