సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: ఫస్ట్ ప్లేస్‌లో హన్సిక, కరీష్మా

Siva Kodati |  
Published : May 02, 2019, 03:00 PM IST
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: ఫస్ట్ ప్లేస్‌లో హన్సిక, కరీష్మా

సారాంశం

సీబీఎస్ఈ ఫలితాలను గురువారం సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

సీబీఎస్ఈ ఫలితాలను గురువారం సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికల ఉత్తీర్ణతా శాతం 88.70 శాతం ఉండగా.. బాలుర ఉత్తీర్ణతా శాతం 79.4 శాతంగా నమోదైంది.

కాగా.. ట్రాన్స్‌జెండర్ విద్యార్ధుల్లో 83.3 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీబీఎస్ఈ ఫలితాల్లో ఈ ఏడాది ఇద్దరు అమ్మాయిలు సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించారు.

గతేడాది ఘజియాబాద్‌కే చెందిన అమ్మాయే టాపర్‌గా నిలవడం విశేషం. ఈ ఏడాది సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 31,14,821 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

దాదాపు 12 లక్షల  మంది విద్యార్ధులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరికి ఫిబ్రవరి- మార్చి మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 4,974 పరీక్షా కేంద్రాల్లో, విదేశాల్లో 78 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు  నిర్వహించింది. 
 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో