జెట్ ఎయిర్‌వేస్ పై సీబీఐ దాడులు.. పలువురిపై కేసులు ..

Published : May 05, 2023, 06:09 PM IST
జెట్ ఎయిర్‌వేస్ పై సీబీఐ దాడులు.. పలువురిపై కేసులు ..

సారాంశం

Jet Airways: బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ శుక్రవారం జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయం, వ్యవస్థాపకుడి ఇంట్లో సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంక్‌ను రూ.538 కోట్ల మేర మోసగించినందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ తదితరులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయం, వ్యవస్థాపకుడి ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. కెనరా బ్యాంక్‌ను రూ.538 కోట్ల మేర మోసగించినందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌,తదితరులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. అందిన సమాచారం ప్రకారం.. కెనరా బ్యాంక్‌ మోసం కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం జెట్ ఎయిర్‌వేస్ పాత కార్యాలయాలు, దాని వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ నివాసంపై దాడులు చేసింది. బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసగించినందుకు గోయల్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. గోయల్, ఆయన భార్య అనిత, విమానయాన సంస్థ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టి నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది.

అదే సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌, గోయల్‌, ఎయిర్‌లైన్స్‌ మాజీ అధికారులతో సహా ఢిల్లీ, ముంబైలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ తీవ్రమైన నగదు కొరత , అప్పుల భారంతో ఏప్రిల్ 2019లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. సుదీర్ఘ దివాలా ప్రక్రియ తర్వాత జూన్ 2021లో దీనిని 
ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయబడింది.

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur