అఖిలేష్, ములాయంలకు ఊరట.. సీబీఐ క్లీన్ చిట్

Published : May 21, 2019, 12:09 PM IST
అఖిలేష్, ములాయంలకు ఊరట.. సీబీఐ క్లీన్ చిట్

సారాంశం

అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 

అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో ఇవాళ తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. అఖిలేశ్, ములాయంలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున 2013 ఆగస్టులో ఈ కేసును మూసివేసినట్టు నివేదించింది.
 
‘‘ప్రాధమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున దీనిని ఎఫ్ఐఆర్ కిందికి మలచలేదు. కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా సీబీఐకి ఎప్పుడూ ఆదేశించలేదు...’’ అని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసులో ములాయం, అఖిలేశ్‌పై ఆగస్టు 2013 తర్వాత ఎలాంటి దర్యాప్తు జరపలేదని సీబీఐ స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ ల‌క్ష్యం ఏంటి.? వ‌చ్చే 20 ఏళ్ల‌లో భార‌త్‌లో ఏం జ‌ర‌గ‌నుంది.
పెళ్ళి పూర్తయ్యింది, అప్పగింతలే మిగిలాయి.. ఈ టైంలో పెళ్లికొడుకు హిజ్రా అని తెలిసి...