కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 31, 2019, 01:19 PM IST
కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురి దుర్మరణం

సారాంశం

జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రజౌరీ జిల్లా దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ్‌కోట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. 

జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రజౌరీ జిల్లా దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ్‌కోట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శనివారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందోనని అక్కడికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?