బైకాట్ మేక్ మై ట్రిప్, గోఐబిబో... సోషల్ మీడియాలో ట్రెండింగ్ 

By Arun Kumar PFirst Published Apr 4, 2024, 8:59 AM IST
Highlights

ట్రావెలింగ్ వెబ్ సైట్స్ పై భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విదేశీ ట్రావెలింగ్ సంస్థలు సున్నితమైన ఢాటాను సేకరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

హైదరాబాద్ : ప్రముఖ ట్రావెలింగ్ సంస్థలు మేక్ మై ట్రిప్, గోఐబిబో లు ప్రజాగ్రహానికి గురవుతున్నాయి. ఈ ట్రావెలింగ్ వెబ్ సైట్స్ ను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్స్(ట్విట్టర్) లో మైక్ మై ట్రిప్ బైకాట్ చేయాలని,  గోఐబిబోను అన్ ఇన్స్టాల్ చేయాలన్న హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రెండు సంస్థలపై నెటిజన్లు చాలా సీరియస్ గా వున్నారు. 

బుధవారం ఉదయంనుండి  BoycottMakeMyTrip , UninstallGoibibo హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వెబ్ సైట్స్ వినియోగదారుల భద్రత విషయంలో చాలా  అలసత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కస్టమర్స్ ప్రైవేట్ డాటాకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారం డిల్లీ హైకోర్టుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ బిజినెస్ సంస్థలకు కఠిన నిబంధనలు అమలుచేయాలని... కస్టమర్స్ డాటా తప్పుదారి పట్టకుండా చూడాలని  కోరుతున్నారు. ఈ మేరకు డిల్లీ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ లిటికేషన్ (పిల్) దాఖలయ్యింది.  అయితే  ఈ ఫిల్ ను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిందిగా కోర్టు సూచించింది. 

Users rally for data privacy, filing a PIL against MakeMyTrip and GoIbibo. Time to switch to safer alternatives? Uninstall Goibibo pic.twitter.com/dZyj9wlCXa

— Natureboy (@ManishR14620116)

 

బిజెపి నేత, ప్రముఖ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ ఫిల్ ను దాఖలుచేసారు. విదేశీ ట్రావెల్ ఏజన్సీస్ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని... ఇందులో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మిలిటరీ ఉన్నతాధికారులు, ఐఎఎస్, ఐపిఎస్ లతో పాటు సామాన్యులు కూడా వున్నారన్నారు. ముఖ్యంగా చైనా చేతికి ఈ డాటా చేరుతోందని... ఇది దేశ భద్రతకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి ట్రావెల్స్ సంస్థలను నియంత్రణ అవసరమని... ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. 

click me!